IRCTC : రైలు ప్రయాణికులకు ఇకపై ఆ బాధ ఉండదు..ఎందుకంటే !!

IRCTC : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవను ప్రారంభించింది.

Published By: HashtagU Telugu Desk
Irctc Pantry Service

Irctc Pantry Service

రైల్లో దూరం ప్రయాణం చేసేవారికి ప్రధాన సమస్య ఫుడ్(Food). రైల్లో అందించే ఫుడ్ ఏమాత్రం బాగోదు. రుచి లేని భోజనం ఇవ్వడం వల్ల ప్రయాణికులు భోజనం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇకపై ఆ బాధ అవసరం లేకుండా ఇకనుంచి శుభ్రమైన, రుచికరమైన భోజనం వారి సీటు వద్దే అందుబాటులోకి రానుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవను ప్రారంభించింది. గతంలో ఈ సేవలు కేవలం ప్రీమియం రైళ్లకే పరిమితమయ్యే. ఇప్పుడు సాధారణ ప్రయాణికులకు కూడా తక్కువ ధరకు నాణ్యమైన భోజనం పొందే అవకాశం లభించనుంది. అధిక ఛార్జీలు, నాసిరకం ఆహారం వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమవుతుంది.

Telangana Formation Day : తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్‌ ప్రణాళికలు: సీఎం రేవంత్‌ రెడ్డి

ఈ-ప్యాంట్రీ అనేది IRCTC అందిస్తున్న డిజిటల్ ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్ సదుపాయం. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కన్ఫర్మ్డ్, RAC లేదా పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకోవచ్చు. టికెట్ బుకింగ్ సమయంలో లేదా అనంతరం ‘బుక్డ్ టికెట్ హిస్టరీ’లో ఈ-ప్యాంట్రీ ఎంపిక చేసి ఆహారాన్ని బుక్ చేయవచ్చు. బుకింగ్ అనంతరం ప్రయాణికులకు ఒక మీల్ వెరిఫికేషన్ కోడ్ (MVC) లభిస్తుంది. ఈ కోడ్‌ను చూపించడం ద్వారా సీటు వద్దే భోజనం అందుతుంది.

ఈ సేవ ద్వారా ప్రయాణికులు ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్, డిజిటల్ పేమెంట్స్, నిర్దిష్ట ధర, IRCTC లైసెన్స్ పొందిన విక్రేతల నుండి మాత్రమే సేవల లభ్యత వంటి ప్రయోజనాలు పొందగలరు. భోజనం డెలివరీ కాకపోతే డబ్బులు తిరిగి లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సేవను వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రారంభించి, రాబోయే 60 రోజుల్లో మరో 25 రైళ్లకు విస్తరించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని రైళ్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు IRCTC ప్రకటించింది. ఇది రైలు ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే కొత్త ముందడుగు అని చెప్పవచ్చు.

  Last Updated: 02 Jun 2025, 10:29 AM IST