ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా

శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్‌ను అమెరికాకు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్‌ నిర్వహిస్తోంది. ఇందులో భారత్‌కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Indian astronaut Subhanshu Shukla's space mission postponed once again

Indian astronaut Subhanshu Shukla's space mission postponed once again

ISRO : భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయాణం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 19న జరగాల్సిన ప్రయోగాన్ని తాజాగా జూన్‌ 22కు వాయిదా వేసినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇప్పటికే ఈ మిషన్‌ పలు సార్లు వాయిదా పడగా, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం అంతరిక్ష ప్రయాణంపై మళ్లీ ఉత్కంఠను పెంచింది. శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్‌ను అమెరికాకు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్‌ నిర్వహిస్తోంది. ఇందులో భారత్‌కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు భాగస్వాములుగా ఉన్నాయి. శుభాంశు ఈ మిషన్‌లో మిషన్‌ పైలట్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు.

Read Also: Youtube : యూట్యూబ్ లో ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుందో తెలుసా..?

అంతరిక్ష ప్రయాణానికి ఉపయోగిస్తున్న ఫాల్కన్‌-9 రాకెట్‌లో గతంలో ధ్రవ ఆక్సిజన్‌ లీక్‌ అవుతున్నట్లు గుర్తించడంతో, ఈ నెల 11న జరగాల్సిన ప్రయోగాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్రో సమస్య పరిష్కారమైందని ప్రకటించి, జూన్‌ 19ను ప్రయోగ తేది‌గా ప్రకటించింది. అయితే తాజాగా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక అంశాలు, అంతరిక్షయాత్రికుల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మళ్లీ వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రయోగ తేదీపై ఇస్రో బృందం యాక్సియం స్పేస్‌తో విస్తృత చర్చలు జరిపింది. ప్రయోగానికి సంబంధించిన నాసా, స్పేస్‌ ఎక్స్‌తో సమన్వయం కొనసాగుతోంది. తాజా మరమ్మతులు, వాతావరణ పరిస్థితుల విశ్లేషణ, సిబ్బంది ఆరోగ్య పరిస్థితులన్నింటిని గమనించి, జూన్‌ 22ను తదుపరి ప్రయోగ తేదీగా ఖరారు చేశారు అని పేర్కొంది.

ఈ మిషన్‌లో శుభాంశుతో పాటు మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు పాల్గొంటున్నారు. ఫలితంగా ఫాల్కన్-9 రాకెట్‌ ద్వారా వారు అంతరిక్షంలోకి ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం ప్రారంభమైన 28 గంటల తర్వాత వారి వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)తో అనుసంధానమవుతుంది. అక్కడ వారు 14 రోజుల పాటు గడిపి, శూన్య గరుత్వ స్థితిలో పలు ప్రయోగాలు చేపడతారు.ఈ ప్రయాణం సందర్భంగా శుభాంశు బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పాఠశాల విద్యార్థులతో వీడియో ద్వారా సంభాషణ జరపనున్నారు. ఈ సందర్భంగా యువతకు విజ్ఞాన పరంగా ప్రేరణనిచ్చే కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, శుభాంశు శుక్లా రోదసి యాత్ర భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది. అయితే, మళ్లీ వాయిదా వేయడం నిరుత్సాహానికి గురిచేస్తున్నా, ప్రయోగం విజయవంతం కావడం కోసం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలుగా చూడాల్సిన అవసరం ఉంది.

Read Also: Indian Railway : తెలంగాణ లో కొత్త రైళ్ల తయారీ

  Last Updated: 18 Jun 2025, 10:38 AM IST