Site icon HashtagU Telugu

Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్‌ను దాటేసిన భారత్

Indian Nuclear Weapons

Indian Nuclear Weapons

Nuclear Weapons : గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది. అణ్వాయుధాల లెక్కలో పాకిస్తాన్‌ను భారత్ దాటేసింది. తాజాగా స్వీడన్ దేశానికి చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) సంస్థ విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు.  దీని ప్రకారం.. ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద 172 అణు వార్‌హెడ్‌లు ఉండగా.. పాకిస్తాన్ వద్ద 170 వార్ హెడ్‌లు ఉన్నాయి. భారతదేశం 2023లో అణ్వాయుధాల సంఖ్యను పెంచడంపై ఫోకస్ చేసిందని ఈ లెక్కలను బట్టి స్పష్టమవుతోంది. అణ్వాయుధాలను ప్రయోగించే సరికొత్త పద్ధతులను డెవలప్ చేయడంపై గత సంవత్సరం భారత్, పాకిస్తాన్‌లు ముమ్మరంగా రీసెర్చ్ చేశాయని నివేదిక తెలిపింది. అంటే.. యుద్ధ విమానాలు, మిస్సైళ్లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో  అణ్వాయుధాలను ప్రయోగించే ఆప్షన్లను మరింత పర్ఫెక్టుగా వినియోగించుకోవడంపై ఈ దేశాలు పనిచేశాయన్న మాట. ఇక భారత్ పొరుగుదేశం చైనా వద్ద 2024 జనవరి నాటికి 500 అణు వార్‌హెడ్‌లు(Nuclear Weapons) ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

నివేదికలోని కీలక అంశాలివీ.. 

Also Read :Listen To This Page : ఇక గూగుల్ క్రోమ్‌లో చదవొద్దు.. వినేయండి..

Also Read : Paneer Fresh: ఫ్రిజ్‌లో ఉంచిన పన్నీరు గట్టిగా మారకుండా ఉండాలంటే చేయండిలా..!