Agni-1 Ballistic Missile: భారతదేశం గురువారం (జూన్ 1) ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 (Agni-1 Ballistic Missile) శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ తెలిపారు. శిక్షణా ప్రయోగంలో క్షిపణి అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులు విజయవంతంగా ధృవీకరించబడినట్లు ఆయన చెప్పారు.
భారతదేశం గత రెండు దశాబ్దాలుగా వివిధ బాలిస్టిక్ క్షిపణులు, ఖచ్చితత్వ-గైడెడ్ ఆయుధాలు, సంబంధిత ‘ప్లాట్ఫారమ్’లను అభివృద్ధి చేయడం ద్వారా తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తోంది. భారతదేశం ‘అగ్ని’ సిరీస్ క్షిపణుల వివిధ రకాలను అభివృద్ధి చేసింది. గత డిసెంబర్లో భారత్ 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని 1 నుండి 4 క్షిపణులు 700 కి.మీ నుండి 3,500 కి.మీల పరిధిని కలిగి ఉంటాయి. ఇప్పటికే అవి మోహరించబడ్డాయి.
Also Read: MS Dhoni: ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
DRDO అభివృద్ధి చేసింది
అణు సామర్థ్యం గల అగ్ని సిరీస్ క్షిపణులను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. ఇవి ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు. ఇవి సాలిడ్ రాకెట్ ప్రొపెల్లెంట్ సిస్టమ్తో నడిచే అత్యాధునిక క్షిపణులు. అవి పిన్ పాయింట్ కచ్చితత్వంతో లక్ష్యాలను చేధించగలవు. క్షిపణుల్లో ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థలు ఉంటాయి. 15 మీటర్ల పొడవైన అగ్ని-I క్షిపణి 1,000 పేలోడ్ను మోసుకెళ్లగలదు.