Delhi: ఢిల్లీ ప్రజలకు సీఎం అతిషి ప్రమాద హెచ్చరికలు

Delhi: బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఢిల్లీ కంటే కరెంటు బిల్లు 4 రెట్లు ఎక్కువ అని చెప్పారు ఢిల్లీ సీఎం అతిషి. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ ఎన్నుకుని ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. లేకపోతే ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో మనం చూస్తున్నది ఢిల్లీలో కూడా అదే చూస్తామని హెచ్చరించారు

Published By: HashtagU Telugu Desk
Delhi

Delhi

Delhi: ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అన్నారు. విద్యుత్ చార్జీలు పెరగబోయే ప్రమాదం ఉన్నారు. అలాగే సుదీర్ఘ విద్యుత్ కోతలను చూస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి హెచ్చరించారు.

అతిషి మాట్లాడుతూ.. “ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం 5 కిలోవాట్ల విద్యుత్ కనెక్షన్ ధరను 118% పెంచింది, తద్వారా రూ. 7,967 నుండి రూ. 17,365కి చేరుతుందని ఆమె అన్నారు. అంటే 1-కిలోవాట్ కనెక్షన్‌కి 250% పెరిగిందన్నారు. వేసవి సీజన్‌లో 8 గంటల కరెంటు కోతలు విధించారు మరియు ఏ మారుమూల గ్రామంలోనూ ఈ విద్యుత్ కోతలు విధించలేదని తెలిపారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో ఈ 8 గంటల విద్యుత్ కోతలు విధించబడుతున్నాయి అని అతిషి చెప్పారు. అందుకే ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ ఎన్నుకుని ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. లేకపోతే ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో మనం చూస్తున్నది ఢిల్లీలో కూడా అదే చూస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన బూత్ స్థాయి సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. గురువారం జరిగిన కీలక సమావేశంలో ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్, రాష్ట్ర కన్వీనర్ గోపాల్ రాయ్ డివిజనల్ ఇన్‌ఛార్జ్‌లను సమీకరించి, ప్రతి బూత్‌ను గెలుస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Also Read: Jani Master Remand Report : నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్

  Last Updated: 20 Sep 2024, 06:07 PM IST