Site icon HashtagU Telugu

Deve Gowda: లోక్‌సభ ఎన్నికలకు దూరంగా మాజీ ప్రధాని దేవెగౌడ

Deve Gowda

Deve Gowda

Deve Gowda: వయసు దృష్ట్యా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకటించారు.90 ఏళ్ల జేడీఎస్ అధినేత తాను ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నా వయసు ఇప్పుడు 90. నాకు మాట్లాడే శక్తి ఉంది మరియు జ్ఞాపకశక్తి ఉంది. దాంతో ప్రచారం చేస్తాను అని గౌడ్ విలేకరుల సమావేశంలో అన్నారు.

జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై మాజీ ప్రధాని ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రధాని మోదీ ఏది చెబితే అది పాటిస్తామన్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు మోదీ 11 రోజుల తీవ్ర తపస్సు చేశారని గౌడ ప్రశంసించారు. మోదీ ఎన్నో పుణ్యాలు చేశారని, అందుకే రామ మందిర ప్రతిష్ఠాపనను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక క్రమశిక్షణతో నిర్వహిస్తారని చెప్పారు. జనవరి 22న తన సతీమణి చెన్నమ్మతో కలసి శంకుస్థాపనకు హాజరవుతానని మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు.

హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ కుమారుడు కుమారస్వామి సమావేశమైన తర్వాత జేడీ(ఎస్) గత ఏడాది సెప్టెంబర్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీ చేస్తామని రెండు పార్టీలు చెబుతున్నాయి. గతేడాది మేలో 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేడీ(ఎస్) కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 135, బీజేపీకి 66 సీట్లు వచ్చాయి.

Also Read: Makar Sankranti 2024: అత్తాపూర్‌లో విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం