Death Threat : అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై దాడి చేసి చంపుతామని వార్నింగ్ ఇచ్చాడు. త్రివర్ణ పతాకాన్ని సీఎం మాన్ ఎగురవేసే చోటే దాడి చేస్తామన్నాడు. ఇందుకోసం పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు తనను సంప్రదించాలని కోరాడు. ఈమేరకు ఒక వీడియోను అతడు విడుదల చేశాడు. గతంలో ఆత్మాహుతి దాడిలో చనిపోయిన పంజాబ్ మాజీ సీఎం బియంత్ సింగ్తో.. ప్రస్తుత సీఎం గురుపత్వంత్ సింగ్ మాన్ను పన్నూ పోల్చాడు. పంజాబ్లో శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు వరుసపెట్టి గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేయిస్తున్న రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్కు కూడా పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘పంజాబ్ పోలీసులు యువతను అణచివేస్తున్నారు. వారిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. యువతపై గ్యాంగ్స్టర్లు అనే ముద్రవేసి జైళ్లలో వేస్తున్నారు. నేటి బియంత్ సింగ్గా మారిన సీఎం భగవంత్ మాన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున ఈ పరిణామాలు మారిపోతాయి’’ అని గురుపత్వంత్ సింగ్ పన్నూ(Death Threat) చెప్పాడు.
We’re now on WhatsApp. Click to Join.
- యూకే-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన గురుపత్వంత్ సింగ్ పన్నూ ఒక ఖలిస్తాన్ ఉగ్రవాది.
- ఇతనికి పాకిస్తాన్, ఐఎస్ఐతో లింకులు కూడా ఉన్నాయి.
- పన్నూ నడిపే సిక్ ఫర్ జస్టిస్ సంస్థను ఉగ్రసంస్థగా భారత్ గుర్తించింది.
- ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు గతేడాది జూన్లో అరెస్ట్ చేశారు.
- ప్రస్తుతం నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నాడు.
- ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో నిందితుడైన భారత్కు చెందిన నిఖిల్ గుప్తాకు ఆధారాలు అందజేతకు అమెరికా నిరాకరించింది.
- ప్రస్తుతం ప్రాగ్ జైల్లో ఉన్న అతడిని అధీనంలోకి తీసుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
- ఈ క్రమంలోనే జనవరి 4న గుప్తా తరఫు న్యాయవాది.. న్యూయార్క్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- ఈ కేసులో నిఖిల్ గుప్తా న్యూయార్క్ కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే తాము ఆధారాలను అందజేస్తామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
- దేశపౌరుడు అనే కారణాన్ని చూపించి.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ పరిణామాలు అద్దంపడుతున్నాయి.