Death Threat : అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై దాడి చేసి చంపుతామని వార్నింగ్ ఇచ్చాడు. త్రివర్ణ పతాకాన్ని సీఎం మాన్ ఎగురవేసే చోటే దాడి చేస్తామన్నాడు. ఇందుకోసం పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు తనను సంప్రదించాలని కోరాడు. ఈమేరకు ఒక వీడియోను అతడు విడుదల చేశాడు. గతంలో ఆత్మాహుతి దాడిలో చనిపోయిన పంజాబ్ మాజీ సీఎం బియంత్ సింగ్తో.. ప్రస్తుత సీఎం గురుపత్వంత్ సింగ్ మాన్ను పన్నూ పోల్చాడు. పంజాబ్లో శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు వరుసపెట్టి గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేయిస్తున్న రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్కు కూడా పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘పంజాబ్ పోలీసులు యువతను అణచివేస్తున్నారు. వారిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. యువతపై గ్యాంగ్స్టర్లు అనే ముద్రవేసి జైళ్లలో వేస్తున్నారు. నేటి బియంత్ సింగ్గా మారిన సీఎం భగవంత్ మాన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున ఈ పరిణామాలు మారిపోతాయి’’ అని గురుపత్వంత్ సింగ్ పన్నూ(Death Threat) చెప్పాడు.