Gold Price Today: పండగ పూట భగ్గుమంటున్న బంగారం ధరలు.. రూ. 60 వేలకు చేరిన గోల్డ్..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) పండగ పూట పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,000గా నమోదైంది.

  • Written By:
  • Updated On - March 22, 2023 / 09:56 AM IST

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) పండగ పూట పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,000గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 74,700 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (మార్చి 22, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,150గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,770గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,000 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050గా ఉంది.

Also Read: Telugu Calendar: తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకో తెలుసా?

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,100 ఉండగా, ముంబైలో రూ.72,100గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,700 ఉండగా, కోల్‌కతాలో రూ.72,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,700 ఉండగా, కేరళలో రూ.74,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,700 ఉండగా, విజయవాడలో రూ.74,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.