జాతీయ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన మంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. మోదీ క్యాబినెట్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన హఠాత్తుగా పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జార్జి కురియన్ సమర్పించిన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. ఇప్పటివరకు మోదీ క్యాబినెట్లో ఆయన మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పాడి, పశుపోషణ శాఖలకు కూడా సహాయ మంత్రి హోదాలో బాధ్యతలు నిర్వహించారు.
జార్జి కురియన్ రాజ్యసభ ఎంపీ పదవీ కాలం గత ఆదివారం అంటే జూన్ 21న ముగిసింది. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంట్లో (లోక్సభ లేదా రాజ్యసభ) సభ్యుడిగా లేని వ్యక్తి గరిష్టంగా 6 నెలలు మాత్రమే మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి బీజేపీ ఆయనను తిరిగి రాజ్యసభకు పంపేందుకు మొగ్గు చూపకపోవడంతో, ఆయన తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రివర్గంలో ఏకైక క్రైస్తవ మంత్రి జార్జి కురియన్ మాత్రమే కావడం ఇక్కడ గమనార్హం. కేరళలో క్రైస్తవ ఓటు బ్యాంక్ను ఆకట్టుకునే క్రమంలో బీజేపీ ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.
