మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మధ్య బలమైన మానసిక సంబంధం ఉందని బోస్ కుమార్తె అనితా బోస్ వెల్లడించారు. ఇద్దరి ఆలోచనలు రెండు విభిన్న ధ్రువాలుగా ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం తీసుకు రావడంలో ఇద్దరూ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. బోస్ ను బ్రిటీష్ వాళ్లకు అప్పగించడానికి నెహ్రూ, గాంధీ ఇద్దరూ సిద్ధపడ్డారని బాలీవుడ్ హీరోయిన్ పద్మశ్రీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. భారత దేశానికి నిజమైన స్వాతంత్ర్యం 2014లో మాత్రమే వచ్చిందని ఇటీవల రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోన్న విషయం విదితమే.
తాజాగా బోస్ ను బ్రిటీష్ వాళ్లకు అప్పగించడానికి గాంధీ, నెహ్రూ సిద్ధపడ్డారని వివాదస్పద వ్యాఖ్యలను కంగనా సోషల్ మీడియా వేదికగా చేశారు. ఆమె చేసిన కామెంట్స్ పై నేతాజీ కుమార్తె అనితా బోస్ స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. నేతాజీ మరియు గాంధీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వీరులు. ఒకటి లేకుండా మరొకటి చేయలేరు. ఇది కలయిక. కొంతమంది కాంగ్రెస్ సభ్యులు చాలా కాలంగా క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించినట్లు కాదు – భారతదేశ స్వాతంత్ర్యానికి అహింసా విధానం మాత్రమే కారణమని. నేతాజీ మరియు INA (ఇండియన్ నేషనల్ ఆర్మీ)చర్యలు కూడా భారతదేశ స్వాతంత్ర్యానికి దోహదపడ్డాయని మనందరికీ తెలుసు. నేతాజీ మరియు INA మాత్రమే భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని చెప్పుకోవడం అర్ధంలేనిది.
నేతాజీతో సహా పలువురికి గాంధీ స్ఫూర్తినిచ్చారని అనితా బోస్ తెలిపారు. సుభాష్ చంద్రబోస్ , భగత్ సింగ్లకు మహాత్మా గాంధీ నుండి ఎటువంటి మద్దతు లభించలేదని కంగనా రనౌత్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ కథనాల సిరీస్లో పేర్కొనడం వివాదంగా మారింది. గాంధీ అహింస మంత్రాన్ని ఎగతాళి చేశారు. “గత వారం భారత స్వాతంత్రాన్ని భిక్షగా అభివర్ణిస్తూ 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటించింది. స్వాతంత్ర్యం 2014లో మాత్రమే లభించిందని, 1947లో కాదని కంగనా చేసిన ప్రకటనపై ప్రశ్నించినప్పుడు స్వాతంత్య్రాన్ని ఏకపక్షంగా చూడడం అమాయకమని అనిత అన్నారు. మొత్తం మీద బాలీవుడ్ నటి కంగనా చేస్తోన్న వ్యాఖ్యలపై భిన్న స్వరాలు వినిపించడం గమనార్హం.