Amritpal Singh Arrested: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన అమృత్ పాల్ సింగ్.. నెల రోజుల తర్వాత అరెస్ట్

ఖలిస్తాన్ మద్దతుదారు, పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్‌ (Amritpal Singh)ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ (Arrested) చేశారు. ఆదివారం (ఏప్రిల్ 23) మోగాలోని గురుద్వారా నుంచి అతడిని అరెస్టు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Amritpal Singh

Amritpal Singh

ఖలిస్తాన్ మద్దతుదారు, పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్‌ (Amritpal Singh)ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ (Arrested) చేశారు. ఆదివారం (ఏప్రిల్ 23) మోగాలోని గురుద్వారా నుంచి అతడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వ్యక్తి 36వ రోజు పోలీసులకు పట్టుబడ్డాడు. మార్చి 18 నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అయితే ఈలోగా ఆయన మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో అజ్నాలాలోని పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన తర్వాత రాడికల్ బోధకుడు పరారీలో ఉన్నాడు.

కిడ్నాప్, అల్లర్లలో నిందితులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అతను, అతని మద్దతుదారులు కలిసి అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ కేసులో అజ్నాలా పోలీసులు ఫిబ్రవరి 16న అమృతపాల్‌తో పాటు అతని 25 మంది సహచరులపై కేసు నమోదు చేశారు.

వాస్తవానికి సెప్టెంబర్ 29, 2021న దీప్ సిద్ధూగా ప్రసిద్ధి చెందిన సందీప్ సింగ్ సిద్ధూ పంజాబ్ కోసం పోరాడటానికి, దాని సంస్కృతిని రక్షించడానికి ఒక సమూహంగా ‘వారిస్ పంజాబ్ దే’ని ప్రారంభించారు. ఫిబ్రవరి 15, 2022న ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఉద్యమంలో జాతీయ వార్తల్లోకి వచ్చిన దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సెప్టెంబర్ 29, 2022న దీప్ సిద్ధూ మరణించిన కొన్ని నెలల తర్వాత అమృతపాల్ సింగ్‌ను అతని మద్దతుదారులు ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్‌గా చేశారు.

Also Read: Mumbai-Bangalore Highway: ముంబై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

16 ఫిబ్రవరి 2023న అజ్నాలాలో అమృతపాల్ సింగ్, లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్‌లపై కిడ్నాప్, దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడి జరిగిన మరుసటి రోజే తూఫాన్‌ను అజ్నాలా పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి అమృతపాల్, అతని మద్దతుదారులు అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. తూఫాన్‌ సింగ్ ను విడుదల చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు ముట్టడి చేశారు.

ఆ తర్వాత ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అమృతపాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లగా.. అతడు తప్పించుకున్నాడు. మార్చి 18 నుండి ఎనిమిది కంటే ఎక్కువ జిల్లాల నుండి పోలీసు బృందాలు అమృత్‌పాల్ కాన్వాయ్‌ని అతని స్వస్థలమైన అమృత్‌సర్ నుండి భటిండాకు అనుసరించడం ప్రారంభించాయి. జలంధర్ జిల్లాలోని మెహత్‌పూర్‌లో కాన్వాయ్‌ను ఆపి అమృతపాల్‌కు చెందిన ఏడుగురు సహచరులను అరెస్టు చేశారు. అదే రోజు అమృతపాల్‌పై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించిన తరువాత, పంజాబ్ ప్రభుత్వం అతని మద్దతుదారులలో నలుగురిని అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించింది.

మార్చి 19న రెండో రోజు సోదాలు కొనసాగగా మరో 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 20న జలంధర్‌లోని షాకోట్‌లో అమృతపాల్ మామ హర్జిత్ సింగ్, డ్రైవర్ తెల్లవారుజామున లొంగిపోయారు. హర్జీత్ కూడా NSA కింద నిర్బంధించబడ్డాడు. అతని అరెస్టు తర్వాత దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. మార్చి 28న అమృతపాల్ తన స్నేహితుడు పప్పల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి హోషియార్‌పూర్ జిల్లాలో కనిపించాడు. కానీ మళ్లీ పోలీసుల నుండి తప్పించుకోగలిగాడు. ఏప్రిల్ 10, 2023న పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ ప్రత్యేక స్నేహితుడు పప్పల్‌ప్రీత్‌ను అమృత్‌సర్ జిల్లా నుండి అరెస్టు చేశారు. దీని తరువాత ఈ రోజు అంటే ఏప్రిల్ 23న చివరకు అమృతపాల్‌ను మోగాలోని గురుద్వారా నుండి అరెస్టు చేశారు. అతన్ని అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రెండు రోజుల క్రితం అమృతపాల్ భార్యను దేశం విడిచి వెళ్లకుండా విమానాశ్రయంలో అడ్డుకున్నారు.

  Last Updated: 23 Apr 2023, 10:13 AM IST