ప్రపంచవ్యాప్తంగా మరాథాన్ (Marathon Runner) రంగంలో అద్భుత ప్రతిభను చూపిన బ్రిటిష్–ఇండియన్ వంశానికి చెందిన ఫౌజా సింగ్ (Fauja Singh) 2025 జూలై 14న పంజాబ్లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident )లో మరణించారు. ఆయన వయస్సు 114 సంవత్సరాలు. ‘వయస్సు ఎప్పటికీ అడ్డంకి కాదు’ అనే విషయాన్ని తాను జీవితం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన, పంజాబ్లోని బియాస్ పిండ్ అనే గ్రామంలో 1911 ఏప్రిల్ 1న జన్మించారు. చిన్నతనంలోనే కాళ్ల బలహీనతతో సతమతమై ఐదేళ్ల వయస్సు వరకు నడవలేకపోయారు. కానీ అదే వ్యక్తి అనంతరం ప్రపంచ మారథాన్ల్లో పరుగులు పెట్టడం విశేషమే.
ఫౌజా సింగ్ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. 1992లో ఆయన భార్య జియాన్ కౌర్ మరణించగా, 1994లో కుమారుడు కుల్దీప్ మరణించడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఆయన జాగింగ్ ప్రారంభించారు. ఇంగ్లండ్లో స్థిరపడిన ఆయన ఆ సమయంలో వయస్సు ఉన్నప్పటికీ, దృఢ నిశ్చయంతో పరుగులు మొదలుపెట్టారు. తన శోకాన్ని శక్తిగా మార్చుకున్న ఫౌజా, పరుగుల మాధ్యమంగా ప్రపంచానికి స్ఫూర్తిగా మారారు.
India vs England: లార్డ్స్ టెస్ట్లో పోరాడి ఓడిన భారత్.. 22 పరుగులతో ఇంగ్లాండ్ విజయం!
2000లో ఫౌజా సింగ్ 89 ఏళ్ల వయస్సులో లండన్ మారథాన్ ద్వారా తన పరుగుల ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ మారథాన్ను 6 గంటల 54 నిమిషాల్లో పూర్తి చేశారు. ఆపై న్యూయార్క్, టొరంటో, ముంబయి మారథాన్లలో పాల్గొన్నారు. 2003లో టొరంటో మారథాన్లో 5 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేసి అత్యంత గొప్ప వ్యక్తిగత ప్రదర్శనను ఇచ్చారు. 2011లో కెనడాలోని టొరంటోలో జరిగిన ఓ ఈవెంట్లో 100+ వయస్సు వర్గంలో ఒక్కరోజులో ఎనిమిది ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఘనత కూడా ఫౌజాకు దక్కింది. అందుకే ఆయనకు ‘టర్బన్డ్ టోర్నాడో’ అనే బిరుదు లభించింది.
ఫౌజా సింగ్ జీవితగాధను ఖుష్వంత్ సింగ్ రచించిన “టర్బన్డ్ టోర్నాడో” పుస్తకంలో 2011లో ప్రచురించారు. 2021లో ఆయన జీవితంపై “Fauja” అనే బయోపిక్ను ఓముంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. 2003లో ఆయన అమెరికా వెలుపలి వ్యక్తిగా మొదటిసారిగా Ellis Island Medal of Honor పొందిన ఘనతను సొంతం చేసుకున్నారు. పీటా ప్రచారంలో పాల్గొన్న అత్యంత వృద్ధ వ్యక్తిగా గుర్తింపు పొందారు. డేవిడ్ బెక్హామ్, మహమ్మద్ అలీతో కలిసి ఓ కమర్షియల్లో నటించడం ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫౌజా సింగ్ మానవ విలువలు, ఆరోగ్య జీవన విధానంపై తన జీవితం ద్వారా స్పష్టమైన సందేశాన్ని అందించిన మహోన్నత వ్యక్తిగా నిలిచారు.