Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్‌లో రామ్మోహన్‌ నాయుడు వివరణ

ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక అందింది. ప్రస్తుతం మేము ఆ నివేదికను పరిశీలిస్తున్నాం. తుది నివేదిక సిద్ధమయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు బయటపడతాయి అని మంత్రి రాజ్యసభలో తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
False propaganda on Ahmedabad plane crash.. Rammohan Naidu's explanation in Parliament

False propaganda on Ahmedabad plane crash.. Rammohan Naidu's explanation in Parliament

Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేగంగా కొనసాగుతున్న వేళ, ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదం పై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక అందింది. ప్రస్తుతం మేము ఆ నివేదికను పరిశీలిస్తున్నాం. తుది నివేదిక సిద్ధమయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు బయటపడతాయి అని మంత్రి రాజ్యసభలో తెలిపారు. ప్రమాదం తర్వాత తక్షణమే సమగ్ర దర్యాప్తును ప్రారంభించామని, సంబంధిత నిపుణులతో కూడిన బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తోందన్నారు. రామ్మోహన్‌ నాయుడు స్పష్టంగా చెప్పారు.

Read Also: Outer Ring Rail Project : తెలంగాణ మణిహారంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు

ఇలాంటి ప్రమాదాల సమయంలో కొందరు మీడియా సంస్థలు, ముఖ్యంగా కొన్ని విదేశీ మీడియా సంస్థలు, పరిశీలన లేకుండా తప్పుడు వాదనలను ప్రచారం చేయడం బాధాకరం. నిర్ధారణలు లేకుండా అభిప్రాయాలు వెల్లడించడం వల్ల ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి. ఇది బాధితుల కుటుంబాలను మరింత కుంగదీసే అవకాశం ఉంది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా విమాన ప్రమాదాలపై దర్యాప్తు జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధోరణి అని మంత్రి పేర్కొన్నారు. “ప్రతి విమాన ప్రమాదం అనంతరం ICAO (International Civil Aviation Organization) మార్గదర్శకాలను అనుసరించి విచారణ జరుపుతాం. ఇది ఒక వ్యవస్థాత్మక ప్రక్రియ. ఒకసారి తుది నివేదిక అందిన తర్వాత వాటి ప్రకారం భద్రతా చర్యలను మేము పునర్వ్యవస్థీకరిస్తాం,” అని వివరించారు.

భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నూతన భద్రతా ప్రమాణాలు రూపొందిస్తున్నామని తెలిపారు. పైలట్ల శిక్షణ, విమాన మరిటెనెన్స్, నావిగేషన్ పరికరాల పనితీరు వంటి అంశాల్లో మరింత శ్రద్ధ వహించనున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారాన్ని ఖండించిన మంత్రి, దేశ ప్రజలను అప్రాధానిక వార్తలను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలకే ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో పౌర విమానయాన రంగ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

Read Also: Supreme Court : వివేకా హత్య కేసు..సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు

  Last Updated: 21 Jul 2025, 12:51 PM IST