Prizes For Voters : ఓటు వజ్రాయుధం. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన ప్రజలకు లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగులు, ల్యాప్ టాప్లు, స్కూటర్లు, బైక్లు, ఫ్రిజ్లను అందజేస్తామని వెల్లడించారు. ఇంతకీ ఈ నిర్ణయాన్ని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు ఎందుకు తీసుకున్నారో తెలుసా ? ఇప్పటికే మన దేశంలో రెండు విడతల పోలింగ్ జరిగింది. ఈ రెండు దశల్లో మధ్యప్రదేశ్లోని లోక్సభ స్థానాల్లో పోలింగ్ గత ఎన్నికల కంటే 8.5 శాతం తక్కువగా నమోదైంది.తదుపరి విడతల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకుగానూ ఓటర్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఆకర్షణీయమైన గిఫ్టులను అందిస్తామని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రయోగం ఫలించి.. మే 7న జరిగే మూడో దశ ఎన్నికల్లో ఓటింగ్(Prizes For Voters) శాతం ఎంత పెరుగుతుందో వేచిచూడాలి.
We’re now on WhatsApp. Click to Join