Gang Rape : ఘ‌జియాబాద్‌లో ఢిల్లీ మ‌హిళ కిడ్నాప్‌.. ఆపై సాముహిక అత్యాచారం

ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళను ఘజియాబాద్‌లో ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం...

  • Written By:
  • Publish Date - October 19, 2022 / 11:28 AM IST

ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళను ఘజియాబాద్‌లో ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉందని.. ఆమె లోపల ఇనుప రాడ్ ఇంకా ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు శాటిలైట్ టౌన్‌ని ఢిల్లీకి కలిపే ఆశ్రమ రహదారికి సమీపంలో పడి ఉన్న మహిళను ఘజియాబాద్ పోలీసులు జీటీబీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లో బర్త్‌డే పార్టీ ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న మహిళను ఆమె సోదరుడు బస్టాండ్‌లో దింపేశాడు. ఆమె బస్సు కోసం వేచి ఉండగా, ఒక కారు మహిళ వద్దకు వచ్చింది. ఐదుగురు వ్యక్తులు ఆమెను అందులోకి లాగినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఘజియాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు నిందితుల‌ వివరాలను కోరుతూ నోటీసు జారీ చేసింది