NewsClick News: న్యూస్‌క్లిక్ కార్యాలయానికి సీల్ వేసిన ఢిల్లీ పోలీసులు

న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు సీల్ వేశారు. చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బులు అందుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Newsclick

Newsclick

NewsClick News: న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు సీల్ వేశారు. చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బులు అందుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడ్డారు. ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసు దర్యాప్తునకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం న్యూస్ పోర్టల్ దానికి సంబందించిన జర్నలిస్టుల 30 ప్రదేశాలపై ఆరా తీశారు.  అయితే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ సోదాల్లో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫౌండర్ మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను ఫోరెన్సిక్ బృందం ఢిల్లీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఢిల్లీ పోలీసులు ప్రశ్నించిన వారిలో జర్నలిస్టులు ఊర్మిళేష్, ఔనింద్యో చక్రవర్తి, అభిసార్ శర్మ, పరంజోయ్ గుహా ఠాకుర్తాతో పాటు చరిత్రకారుడు సోహైల్ హష్మీ ఉన్నారు. న్యూస్‌క్లిక్ మాజీ మరియు ప్రస్తుత ఉద్యోగుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. COVID-19 కవరేజ్ మరియు రైతుల నిరసనలతో సహా వారి గత మరియు ప్రస్తుత వార్తా నివేదికల గురించి వారిని ప్రశ్నించారు. UAPA మరియు IPCలోని ఇతర సెక్షన్ల కింద ఆగస్టు 17న నమోదైన కేసు ఆధారంగా దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

న్యూస్‌క్లిక్ న్యూస్ పోర్టల్‌పై ఢిల్లీ పోలీసుల దాడులను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని పోలీస్ తీరుపై మండిపడుతున్నారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా , నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా దాడులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సంఘటన గురించి ట్వీట్ చేస్తూ.. నిజం మాట్లాడే జర్నలిస్టులు, కార్యకర్తలు మరియు కళాకారులను ప్రభుత్వం అధికారంతో వేధింపులకు గురిచేస్తోంది, అయితే విధేయులు మరియు సానుభూతిపరులైన మీడియా వ్యక్తులను మాత్రం పెంచిపోషిస్తున్నట్టు ఆరోపించారు.

Also Read: KCR Wanted NDA: బీజేపీలోకి కేసీఆర్..? మోడీ షాకింగ్ కామెంట్స్

  Last Updated: 03 Oct 2023, 07:16 PM IST