Site icon HashtagU Telugu

Celebrities Voting : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు వీరే

Delhi Assembly Elections Celebrities Voting 2025

Celebrities Voting :  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది.  ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నిక  జరుగుతోంది. అన్ని స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి.

Also Read :Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో దుమారం.. టీపీసీసీ సీరియస్

ఓటు వేసిన ప్రముఖులు వీరే

Also Read :Pawan Kalyan : ఈరోజు నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది టూర్.. వివరాలివీ

ఓటు వేశాక.. సీఎం అతిషి కీలక వ్యాఖ్యలు

ఓటు వేసిన అనంతరం సీఎం అతిషి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే కావు. ఇవి ఒక ధర్మ యుద్ధం’’ అని ఆమె తెలిపారు. ‘‘మంచి, చెడుకు మధ్య జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ఒక వైపున ఢిల్లీ పురోగతిని కోరుకునే విద్యావంతులు  ఉన్నారు. మరోవైపు గూండాయిజం చలాయించే వ్యక్తులు ఉన్నారు. ఏ వైపు నిలవాలనేది ప్రజల ఇష్టం. ప్రజలు పనిచేసే వాళ్లకే ఓటు వేస్తారనేది నా నమ్మకం. ఢిల్లీ పోలీసులు బహిరంగంగానే బీజేపీ కోసం పనిచేస్తున్నారు’’ అని అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు.