Car Hit A Bike Rider: బైకును ఢీకొట్టిన దిగ్విజయ్‌ కారు

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కారు బైక్ రైడర్‌ను ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దూకి పిల్లర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమైంది.

  • Written By:
  • Publish Date - March 10, 2023 / 09:26 AM IST

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కారు బైక్ రైడర్‌ను ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దూకి పిల్లర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. ఘటన అనంతరం దిగ్విజయ్ సింగ్ కారు దిగి గాయపడిన యువకుడిని జిరాపూర్ ఆసుపత్రికి తరలించారు. కొంత సమయం తరువాత దిగ్విజయ్ సింగ్ స్వయంగా యువకుడిని కలవడానికి జిరాపూర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత భోపాల్‌కు రెఫర్ చేశారు.

ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. ఈ ఘటన జిరాపూర్‌లో జరిగిందని, అయితే దేవుడి దయ వల్ల ఆ యువకుడు పెద్దగా గాయపడలేదని అన్నారు. అతన్ని చికిత్స కోసం భోపాల్‌కు పంపారు. ఘటనకు సంబంధించి మాట్లాడుతూ మేము నెమ్మదిగా వెళ్తున్నామని, చాలా మంది గుమిగూడారని చెప్పారు. అదే స‌మ‌యంలో అక‌స్మాత్తుగా బైక్ రైడ‌ర్ కారు ఎదురుగా వ‌చ్చాడు. ప్రమాదం జరిగింది. అతన్ని ఆసుపత్రికి పంపించారు. క్షతగాత్రునికి చికిత్స అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

Also Read: Gold And Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన ధరలు..!

వాస్తవానికి దిగ్విజయ సింగ్ గురువారం ఒక రోజు పర్యటన నిమిత్తం రాజ్‌గఢ్ చేరుకున్నారు. అక్కడి నుండి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ పురోహిత్ ఇంటి కొడక్యా గ్రామంలో ఓదార్చడానికి వెళ్లారు. కాసేపు ఆగిన తర్వాత తన కారులో రాజ్‌గఢ్‌కు బయలుదేరాడు. అదే సమయంలో జిరాపూర్‌ సమీపంలోని విజయ్‌ కాన్వెంట్‌ స్కూల్‌ ముందు నుంచి ఆయన కాన్వాయ్‌ బయల్దేరుతుండగా.. కాన్వాయ్‌కు ఎదురుగా ఓ బైక్‌ రైడర్‌ అకస్మాత్తుగా రావడంతో వేగంగా వస్తున్న కారు బైక్‌పై వెళ్లే వ్యక్తిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో పరోలియాకు చెందిన యువకుడు రాంబాబు బగ్రీ (20) గాయపడగా, దిగ్విజయ్ సింగ్ స్వయంగా ఆస్పత్రికి తరలించారు. అనంతరం గాయపడిన యువకుడి పరిస్థితిని తెలుసుకునేందుకు జిరాపూర్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. సమయం వృథా చేయకుండా భోపాల్‌కు పంపండి, నేనే అతనికి మంచి వైద్యం చేయిస్తానని చెప్పాడు. యువకుడికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం వైద్యులు భోపాల్‌కు రెఫర్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు.