Site icon HashtagU Telugu

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు

NEET Paper Leak

NEET Paper Leak

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెడుతూనే ఉన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. పేపర్ లీక్ ఘటనతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పేపర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

ఆదివారం బాపు టవర్‌ను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బయటకు రాగానే విలేకరులు ఆయనను ఈ అంశంపై ప్రశ్నలు అడిగారు. అయితే ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడకుండా కారులో వెళ్లిపోయారు. ఆయన మౌనం ప్రతిపక్ష పార్టీల దాడులను మరింత ఉధృతం చేసింది. ఈ రోజు నితీశ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బాపు టవర్‌ పనులు నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నెల రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి అభివృద్ధి పనులను స్వయంగా చూసేందుకు వస్తామని చెప్పారు. నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే నీట్ లీక్ పై ఆయన మాట్లాడకపోవడం విడ్డురంగా ఉంది.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రతిపక్ష నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ దోషులు ఎవరైతే వారిని అరెస్టు చేసి విచారించాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించి అందులో తనను ముడిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు.దీనితో పాటు నీట్ పేపర్ లీక్ కేసుపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ మరియు ఆర్జేడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోందని, దీని వల్ల పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆరోపిస్తున్నారు. అటు విద్యార్థులు సైతం తమకు న్యాయం చేయాలనీ రోడ్డెక్కారు. ఇప్పటికీ కేంద్రం సిబిఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: Sakshi TV9 Ban: ఏపీలో సాక్షి ఛానెల్ పై నిషేధం?

Exit mobile version