CJI – Ayodhya Judgment : ‘అయోధ్య’ తీర్పులో జడ్జీల పేర్లు ఎందుకు లేవో చెప్పిన సీజేఐ

CJI - Ayodhya Judgment : రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై 2019 నవంబరు 9న నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వివరించారు.

Published By: HashtagU Telugu Desk
Cji

Cji

CJI – Ayodhya Judgment : రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై 2019 నవంబరు 9న నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వివరించారు. అయోధ్య కేసులోని విభిన్న దృక్కోణాలను దృష్టిలో ఉంచుకొని.. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒకే స్వరంతో మాట్లాడాలని నిర్ణయించిందని ఆయన అన్నారు. ఈ కేసులోని సున్నితత్వం, తీర్పు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని అయోధ్య కేసులో  ఆనాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారని సీజేఐ తెలిపారు. సాధారణంగా ప్రతి తీర్పుకు న్యాయమూర్తి పేరు ఉంటుందని..  కానీ అయోధ్య కేసులో ఇచ్చే తీర్పులో జడ్జీల పేర్లను ప్రస్తావించకూడదని నాటి ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించిందని చెప్పారు. ఏదైనా కేసులో తీర్పు ఇచ్చే ముందు న్యాయమూర్తులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని, అందులో వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని సీజేఐ స్పష్టం చేశారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై న్యాయనిపుణులు, ఇతరుల విమర్శలకు స్పందించడానికి సీజేఐ చంద్రచూడ్ నిరాకరించారు. న్యాయమూర్తులు ఒక కేసును రాజ్యాంగం, చట్టం ప్రకారం నిర్ణయిస్తారని తెలిపారు. విమర్శలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘న్యాయమూర్తులు తమ భావాలను నిర్ణయాల ద్వారా వ్యక్తపరుస్తారు. కోర్టు నిర్ణయం తర్వాత.. ఈ అభిప్రాయం ప్రజా ఆస్తి అవుతుంది. స్వేచ్ఛా సమాజంలో ప్రజలు దాని గురించి తమ స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి స్వేచ్ఛగా ఉంటారు. విమర్శలకు స్పందించడం కానీ, నా నిర్ణయాన్ని సమర్థించుకోవడం కానీ ఉండదు’’ అని అన్నారు. కోర్టు విశ్వసనీయతపై కూడా సీజేఐ చంద్రచూడ్ మాట్లాడారు. సీజేఐ ప్రకారం.. కోర్టు బెంచ్‌లో చేర్చబడిన న్యాయమూర్తి సంతకం చేసిన తీర్పు కారణాన్ని స్పష్టంగా చూపిస్తుంది. నేను దానిని అక్కడే వదిలివేయవచ్చు.కానీ, సుప్రీంకోర్టు విశ్వసనీయత చెక్కుచెదరకుండా ఉండాలని తన మనస్సులో చాలా స్పష్టంగా ఉంటుందని అన్నారు.

Also Read: Israel : అమెరికా యుద్ధనౌక ఇంటికి.. గాజా నుంచి చాప చుట్టేస్తున్న ఇజ్రాయెల్

స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘ఒక కేసును నిర్ణయించిన తర్వాత.. న్యాయమూర్తి దాని ఫలితం నుంచి దూరంగా ఉంటారు. అనేక కేసుల్లో ఆమోదించబడిన నిర్ణయాలలో నేను మెజారిటీలో ఉన్నాను. చాలా విషయాల్లో మైనారిటీలో కూడా ఉన్నాను. కానీ ఇది న్యాయమూర్తి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వ్యాజ్యంలో న్యాయమూర్తి ఎప్పుడూ పాల్గొనకూడదు. తీర్పు వెలువడిన తర్వాత మేం కేసును వదిలేస్తాం. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన హోదా ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2023  అక్టోబర్ 17న ఇచ్చిన తీర్పులో స్వలింగ సంపర్కులకు సమాన హక్కులు, రక్షణను కూడా గుర్తించింది’’ అని వివరించారు.

  Last Updated: 02 Jan 2024, 09:12 AM IST