Waqf Bill in Lok Sabha: లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు(minister kiren rijiju) వక్ఫ్ చట్టం 1995ని సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, ఎస్పీ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇది మన మతంలో జోక్యం చేసుకోవడమేనని ఎస్పీ ఎంపీ మొహిబుల్లా అన్నారు. దీంతో పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.
పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని లాలన్ సింగ్ విపక్షాలపై ధీమా వ్యక్తం చేశారు. “ఏదైనా సంస్థ నిరంకుశంగా మారినప్పుడు.. దానిని నియంత్రించడానికి, పారదర్శకత కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకత ఉండాలి. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువచ్చాం.” అని స్పష్టం చేశారు.
ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి అన్నారు. “ఏ ఆలయ కమిటీలో హిందువేతర సభ్యుడు లేనప్పుడు వక్ఫ్లో ఎందుకు? ఈ బిల్లు ప్రత్యేకంగా సమానత్వం యొక్క చట్టాన్ని ఉల్లంఘించే మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ బిల్లు పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకం. ఈ దేశం వివిధ మతాలు, వివిధ భాషల ప్రజలు నివసించే లౌకిక దేశం.” అని పేర్కొన్నారు.
Read Also: Vishnu Datta : గురుభక్తిపై బ్రహ్మ రాక్షసుడు, విష్ణు దత్తుడి కథ తెలుసా ?
వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. “ఈ బిల్లు ప్రాథమిక హక్కులపై దాడి. అయోధ్యలోని ఆలయంలో హిందువేతరు ఎవరైనా ఉన్నారా? ఏ దేవాలయం కమిటీలో హిందువేతరునైనా ఉంచారా? అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ కూడా మతపరమైన సంస్థేనని వేణుగోపాల్ అన్నారు. ఇది సమాజాన్ని విభజించే ప్రయత్నంలో భాగంగా జరుగుతోందని మండిపడ్డారు.
కాగా, రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు.