Rahul Gandhi: హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీహార్లోని ముజఫర్పూర్ కోర్టులో కేసు నమోదైంది. దివ్యాన్షు కిషోర్ దాఖలు చేసిన ఈ కేసు తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేస్తూ అతని పిటిషన్ను కోర్టు అంగీకరించింది.
లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు . ఇది దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసింది అని దివ్యాన్షు కిషోర్ అన్నారు. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసినట్లు ఆయన తరపు న్యాయవాది సుమిత్ కుమార్ తెలిపారు. లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మహానుభావులందరూ అహింస మరియు భయాన్ని అంతం చేయాలని వాదించారని, అయితే తమను తాము హిందువులుగా చెప్పుకునే (బిజెపి మరియు ఆర్ఎస్ఎస్) ద్వేషం గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులను హిందువులుగా పరిగణించలేమని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా రాహుల్ పై నిరసనలు వెల్లువెత్తాయి.
Also Read: CM Revanth: సత్ప్రవర్తన ఖైదీలకు సీఎం రేవంత్ క్షమాభిక్ష