Site icon HashtagU Telugu

Jammu Kashmir : నదిలో బస్సులో బోల్తా…6గురు జవాన్లు మృతి..!!

Kashmir

Kashmir

జమ్మూ కశ్మీర్ లో ఘోరం జరిగింది. 39 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6గురు జవాన్లు మరణించారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అమర్ నాథ్ యాత్ర కోసం భద్రతను పర్యవేక్షించిన 37 మంది ITBPజవాన్లు, ఇద్దరు జమ్మూ కశ్మీర్ సివిల్ పోలీసులు. తమ విధులను ముగించుకుని తిరిగి వెళ్తుండగా పహల్ గాం సమీపంలో బస్సులో నదిలో పడిపోయింది. ఆ ప్రాంతమంతా లోతుగా ఉండటంతో బస్సు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. 19 అంబులెన్సులను ఘటనాస్థలానానికి రప్పించి సహాయక చర్యలు చేపట్టారు.

బస్సు బోల్తా ఘటన ఐటీబీపీ జవాన్ల మరణం వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. . మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.