Fire Accident: 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు

21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో సోమవారం జరిగింది. బస్సు కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
fire

Resizeimagesize (1280 X 720) (1) 11zon (1)

21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో సోమవారం జరిగింది. బస్సు కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులందరినీ కిందకు దించారు. గుర్షాగంజ్ లోని జసోదా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్సు దగ్ధమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్ డ్రైవర్ అప్రమత్తత వల్ల ఘోర ప్రమాదం తప్పింది.

Also Read: 50 Women Kidnapped: బుర్కినా ఫాసోలో 50 మంది మహిళల కిడ్నాప్

అంతకముందు.. యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిబ్రామావు ​​కొత్వాలి మార్కెట్‌ సమీపంలో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో ఘటనా స్థలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఫిరోజాబాద్ జిల్లా పైధాత్ గ్రామంలో ఉన్న జఖాయ్ దేవతను దర్శించుకుని తిరిగి వస్తున్న భక్తులతో నిండిన బస్సు చిబ్రామౌ కొత్వాలి ప్రాంతంలోని నిగమ్ మండి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది భక్తులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 100 పడకల ఆస్పత్రికి తరలించారు. బస్సులోని సిబ్బంది మద్యం సేవించినట్లు భక్తులు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడిపాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  Last Updated: 17 Jan 2023, 10:21 AM IST