Haryana Election : 21 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల

BJP second list released: 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. అయితే బీజేపీ ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
Haryana Election Result

Haryana Election Result

BJP second list released: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా బీజేపీ మంగళవారం 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. అయితే బీజేపీ ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది. హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలకు మినహా మొత్తం 88 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించేసింది.

కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తు పొసగలేదు..

మరోవైపు తొలి జాబితాలో సీనియర్లకు సీట్లు దక్కకపోవడంతో చాలా మంది అలకబూనారు. దీంతో ముఖ్యమంత్రి సైనీ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొందరు కనీసం ముఖ్యమంత్రితో చేతులు కలిపేందుకు కూడా ఇష్టపడలేదు. ఇక కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తు పొసగలేదు. అనేక మార్లు పొత్తులపై చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది. ఆప్ కూడా సోమవారం 20 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Read Also: TS High Court : బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

కాగా, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని లాడ్వా నియోజకవర్గం నుండి పోటీ చేయనుండగా, పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ విజ్ అంబాలా కాంట్ స్థానం నుండి పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి సైనీ ప్రస్తుతం కర్నాల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఉపఎన్నికలో ఆయన గెలిచినందున, ఆయన నియోజకవర్గాన్ని బీజేపీ మార్చింది. హర్యానా మాజీ హోం మంత్రి విజ్ తన స్థానం నుండి టిక్కెట్‌ను నిలుపుకున్నారు. అంబాలా కంటోన్మెంట్, ఈ స్థానం నుండి అతను 2009 నుండి వరుసగా మూడు సార్లు విజయం సాధించాడు.

భారత ఎన్నికల సంఘం ఆగస్టు 31 హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు సవరించింది, అలాగే జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా అసెంబ్లీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును అక్టోబర్ 4 నుంచి మార్చింది. అక్టోబర్ 8. ECI ప్రకారం వారి గురు జంభేశ్వరుని స్మారకార్థం అసోజ్ అమావాస్య పండుగ వేడుకలో పాల్గొనే శతాబ్దాల నాటి ఆచారాన్ని సమర్థించిన బిష్ణోయ్ కమ్యూనిటీ యొక్క ఓటింగ్ హక్కులు మరియు సంప్రదాయాలు రెండింటినీ గౌరవించాలని నిర్ణయం తీసుకుంది.

Read Also: IPhone 16 Launch: మార్కెట్లోకి ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే!

  Last Updated: 10 Sep 2024, 03:37 PM IST