Tram Service : ట్రైన్స్ కాదు ట్రామ్స్.. ఇవి బెంగాల్ రాజధాని కోల్కతాలో ఫేమస్. వీటికి 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. కోల్కతా వారసత్వ సంపదలో భాగంగా మారిన ట్రామ్స్ (రెండు బోగీల మినీ రైలుబండ్లు) సేవలను ఇక ఆపేయాలని మమతా బెనర్జీ సర్కారు నిర్ణయించింది. ఈవివరాలను బెంగాల్ రవాణా మంత్రి స్నేహాశీస్ చక్రబర్తి వెల్లడించారు. కోల్కతాలోని మైదాన్- ఎస్ప్లనేడ్ మార్గంలో కొంతకాలం పాటు ట్రామ్ల సేవలను కంటిన్యూ చేస్తామని తెలిపారు.
Also Read :Ex IPS officer Vs Ex Army chief : మాజీ ఐపీఎస్ నాగేశ్వర రావు వర్సెస్ మాజీ ఆర్మీ చీఫ్.. ఆ ఘటనపై ట్వీట్ వార్
ట్రామ్స్ సేవలను(Tram Service) ఇంతకీ ఎందుకు ఆపేస్తున్నారు ? అంటే.. కోల్కతా నగర రోడ్లపై ఇప్పుడు ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. ఈక్రమంలో రోడ్లపై నుంచి నెమ్మదిగా రాకపోకలు సాగించే ట్రామ్ల వల్ల ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. దీనివల్ల వాహనదారుల రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించే ఉద్దేశంతో ట్రామ్ సర్వీసులను ఆపేయాలని బెంగాల్ సర్కారు నిర్ణయించింది.
Also Read :Pulwama Accused Dies: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
- 1873 సంవత్సరంలో గుర్రాలతో నడిచే ట్రామ్ల సేవలు ప్రారంభమయ్యాయి.
- కాలక్రమంలో ట్రామ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇప్పటి ఆధునిక రూపును సంతరించుకున్నాయి.
- కోల్కతా నగరానికి ప్రత్యేక ఆకర్షణ.. ట్రామ్ సర్వీసులు.
- ఒకప్పుడు కోల్కతా నగరంలో ఎక్కడ చూసినా ట్రామ్ సర్వీసులే కనిపించేవి.
- ట్రామ్ సర్వీసుల నిర్వహణపై దాఖలైన ఒక పిటిషన్ను కలకత్తా హైకోర్టు గతేడాది డిసెంబరులో విచారించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ట్రామ్కార్ సేవలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
- ట్రామ్ కార్ సర్వీసుల అంశం ప్రస్తుతం కోర్టు వద్ద పెండింగ్లో ఉంది. ఇలాంటి సమయంలో వాటి సర్వీసులను పూర్తిగా బంద్ చేయాలనే బెంగాల్ సర్కారు నిర్ణయించపై విమర్శలు వస్తున్నాయి.
- కోల్కతా నగరంలోని వీధుల్లో, రోడ్లపై నడిచే ట్రామ్ల సర్వీసులను మరింత అధునాతన లుక్లోకి తేవాలని వాహనప్రియులు కోరుతున్నారు.
- ట్రామ్ సర్వీసుల వల్ల కలకత్తా టూరిజం పెరుగుతుందని పరిశీలకులు సూచిస్తున్నారు.