Site icon HashtagU Telugu

Battle of Former Couple : ఆ లోక్​సభ సీటులో మాజీ భార్యాభర్తల సవాల్

Battle Of Former Couple

Battle Of Former Couple

Battle of Former Couple : వాళ్లు మాజీ భార్యాభర్తలు. ఈసారి ఒకే లోక్​సభ స్థానం నుంచి తలపడనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఉన్న బిష్ణుపూర్ లోక్​సభ స్థానంలో ఈ విచిత్రమైన  రాజకీయ పోరు జరగనుంది. బిష్ణుపూర్ నుంచి బీజేపీ  అభ్యర్థిగా ఇప్పటికే సౌమిత్ర ఖాన్ పేరును బీజేపీ ప్రకటించింది. ఇక మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ  తాజాగా విడుదల చేసిన లిస్టులో సౌమిత్ర ఖాన్ మాజీ భార్య సుజాత మండల్​​ పేరు ఉంది. దీంతో బిష్ణుపూర్‌లో  మాజీ భార్యాభర్తల పోటీకి రంగం సిద్ధమైంది. సుజాత మండల్ ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ దఫా సుజాతను లోక్‌సభకు పంపాలని దీదీ నిర్ణయించారు.

We’re now on WhatsApp. Click to Join

సౌమిత్ర ఖాన్ తొలుత కాంగ్రెస్‌ పార్టీలో ఉండేవారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సుజాత మండల్​ను 2010లో పెళ్లి చేసుకున్నారు. మొదట టీఎంసీలో ఉన్న సౌమిత్ర ఖాన్, 2019లో లోక్​సభ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. అదే సమయంలో సౌమిత్ర తరఫున సుజాత కూడా ప్రచారం  చేశారు. 2021 సంవత్సరంలో టీఎంసీ పార్టీలో సుజాత  చేరారు. దీంతో అసహనానికి గురైన సౌమిత్ర కెమెరా ముందే సుజాతతో విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇటీవల బీజేపీ, టీఎంసీ వీరిని ఒకే స్థానం నుంచి బరిలోకి దింపాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ మాజీ భార్యభర్తల(Battle of Former Couple) పోటీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : Electoral Bonds : మార్చి 12లోగా ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చండి.. ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

టాలీవుడ్ నటికి హుగ్లీ పార్లమెంట్ టికెట్

Also Read :Bollywood Ramayana : హిందీ రామాయణ్ ను రిజెక్ట్ చేసిన కోలీవుడ్ స్టార్..!