Bibhav Kumar: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్కు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరీ చేసింది. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై బిభవ్ అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎంవో కార్యాలయంలో.. బిభవ్కు ఎటువంటి పోస్టు ఇవ్వకూడదని కోర్టు చెప్పింది. పర్సనల్ అసిస్టెంట్గా లేదా ఇతర హోదాను బిభవ్కు ఇవ్వరాదు అని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. అతని కేసులో అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించేంత వరకు సీఎం కార్యాలయంలోకి బిభవ్ ప్రవేశించరాదు అని కోర్టు ఆదేశించింది. మే 18వ తేదీన బిభవ్ను అరెస్టు చేశారు. వంద రోజుల తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు. సాక్షులను విచారించే వరకు కేసుకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని కోర్టు బిభవ్ కుమార్కు అక్షలు పెట్టింది. ఈ కసరత్తును 3 వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును కోరింది. అంతేకాక కుమార్ అధికారిక పదవిని చేపట్టకుండా నిషేధించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, అరెస్టుకు ముందు, కుమార్ మే 17న ఢిల్లీ పోలీసులకు చేసిన ఇమెయిల్ ఫిర్యాదులో “సిఎం నివాసంలోకి బలవంతంగా మరియు అనధికారికంగా ప్రవేశించి, దుర్వినియోగం చేసి, దాడి చేసి, తప్పుడు కేసుల్లో ఇరికించరా బెదిరించాడు” అని మలివాల్ ఆరోపించారు. తనను సీఎం నివాసం ప్రధాన భవనంలోకి రానివ్వకుండా కుమార్ అడ్డుకోవడంతో ఎంపీ తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించాడని కూడా బిభవ్ కుమార్ ఆరోపించారు.
సాక్ష్యంగా, పోలీసులు బిభవ్ కుమార్ మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్ మరియు సిఎం నివాసంలో అమర్చిన సిసిటివి కెమెరా యొక్క డివిఆర్ / ఎన్విఆర్ను స్వాధీనం చేసుకున్నారు. జూలై 30న, జూలై 16న ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్పై దాఖలు చేసిన ఛార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ పోలీస్ చార్జ్ షీట్లో 500 పేజీలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు 100 మందిని విచారించగా, 50 మందిని సాక్షులుగా చేర్చారు.
Read Also: Health Tips : మిరపకాయలు తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి..?