Amit Shah : గుజరాత్ లో మళ్లీ అధికారం చేపడతాం..రికార్డు స్థాయిలో సీట్లు గెలుస్తాం..!!

  • Written By:
  • Publish Date - November 15, 2022 / 06:19 AM IST

గుజరాత్ లో మరోసారి కాషాయజెండా ఎగురవేస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గుజరాత్ లో బీజేపీకి ప్రజల ఆశీస్సులు ఎ్పపటికీ ఉంటాయని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ను అన్నివిధాల డెవలప్ చేశామన్నారు. అందుకే గుజరాత్ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి వెన్నంటే నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. కాగా కాంగ్రెస్ పార్టీపై తనదైన రీతిలో తీవ్ర విమర్శలు చేశారు షా. ఒక్కప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు 250రోజులు కర్య్ఫూ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కానీ ఇప్పుడు గుజరాత్ అన్ని విధాలా ముందుకు దుసుకుపోతుందన్నారు. బీజేపీ పాలనలో కర్ఫ్యూ అంటే ఎలా ఉంటుందో తెలియదన్నారు. విద్యావంతులైన గుజరాత్ ను తయారు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకే ప్రతిరంగంలోనూ గుజరాత్ ముందుందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి మరోసారి అధికారం చేపడతామన్న అమిత్ షా….సీట్లు కూడా గణనీయస్థాయిలో పెరుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు.