Sunetra vs Supriya : శరద్ పవార్ కుటుంబం మహారాష్ట్ర రాజకీయాల్లో వెరీ స్పెషల్. ఇప్పుడు ఈ బలమైన పొలిటికల్ ఫ్యామిలీ చీలిపోయింది. మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటు దెబ్బకు శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ రెండు ముక్కలైంది. అసలు పార్టీ మేనల్లుడికే దక్కింది. దీంతో తన వర్గానికి మరో కొత్త పేరును శరద్ పవార్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో యావత్ మహారాష్ట్రలో అజిత్ పవార్ పార్టీ, శరద్ పవార్ పార్టీ బలంగా ఢీకొంటున్నాయి. వీటన్నింటిలోనూ బారామతి లోక్సభ స్థానం చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడి నుంచి 1996 నుంచి శరద్ పవార్ పార్టీ గెలుస్తూ వస్తోంది. 2009, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ బారామతి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే(Sunetra vs Supriya) గెలిచారు. ఈసారి బారామతిలో ఆమెకు ఎదురుగాలి వీస్తోంది. ఎందుకంటే.. ఇన్నాళ్లూ సుప్రియకు బలంగా నిలుస్తూ వచ్చిన అజిత్ పవార్ ఇప్పుడు దూరమయ్యారు. ఆయన ఏకంగా తన భార్య సునేత్రా పవార్ను బారామతి నుంచి బరిలోకి దింపారు. ఈ పోటీకి సంబంధించిన మరిన్ని వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
కొల్హాపుర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమంత్ శాహూ ఛత్రపతి మహరాజ్ బరిలో నిలిచారు. ఈయన ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరు. ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని వీబీఏ, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీలు ఈ స్థానంలో శ్రీమంత్ శాహూకు మద్దతు ప్రకటించాయి. ఈ స్థానం నుంచి సీఎం ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ సంజయ్ మండ్లిక్కు టికెట్ ఇచ్చింది.