Man On Pole : మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వే స్టేషన్లోకి వచ్చి.. ఏకంగా రైల్వే ట్రాక్పై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్ల టవర్పైకి ఎక్కాడు. దీన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే విద్యుత్ సప్లైను ఆపేశారు. దీతో ఆ వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత రైల్వే సిబ్బంది వెళ్లి.. ఎంత చెప్పినా ఆ పిచ్చి వ్యక్తి వినిపించుకోలేదు. విద్యుత్ టవర్ పైనుంచి దిగడానికి ససేమిరా అన్నాడు. చివరకు రైల్వే సిబ్బంది ఎలాగోలా నచ్చజెప్పి.. నిచ్చెన సాయంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని కిందికి దింపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఘటన మహారాష్ట్రలోని నందూర్బార్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కరెంట్ స్తంభం నుంచి దింపిన తర్వాత ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇక అతగాడు చేసిన హల్చల్ కారణంగా రైల్వే స్టేషన్లో గంటపాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో భుసావల్ – సూరత్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల తర్వాత రైల్వే సేవలు తిరిగి(Man On Pole) మొదలయ్యాయి.