Man On Pole : రైల్వే విద్యుత్ టవర్ ఎక్కేశాడు.. రెండు గంటలు ట్రైన్లు ఆపేశాడు

Man On Pole :  మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు.

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 06:27 PM IST

Man On Pole :  మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. రైల్వే స్టేషన్‌‌లోకి వచ్చి..  ఏకంగా రైల్వే ట్రాక్‌పై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్ల టవర్‌పైకి ఎక్కాడు. దీన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే విద్యుత్ సప్లైను ఆపేశారు.  దీతో ఆ వ్యక్తికి  పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత రైల్వే సిబ్బంది వెళ్లి.. ఎంత చెప్పినా ఆ పిచ్చి వ్యక్తి వినిపించుకోలేదు. విద్యుత్ టవర్ పైనుంచి దిగడానికి ససేమిరా అన్నాడు. చివరకు రైల్వే సిబ్బంది ఎలాగోలా నచ్చజెప్పి.. నిచ్చెన సాయంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని కిందికి దింపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటన మహారాష్ట్రలోని నందూర్​బార్ రైల్వే స్టేషన్​లో చోటుచేసుకుంది.  కరెంట్ స్తంభం నుంచి దింపిన తర్వాత ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇక అతగాడు చేసిన  హల్‌చల్ కారణంగా రైల్వే స్టేషన్​లో గంటపాటు విద్యుత్​ సరఫరా ఆగిపోయింది. దీంతో భుసావల్ – సూరత్​ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు గంటల తర్వాత రైల్వే సేవలు తిరిగి(Man On Pole) మొదలయ్యాయి.

Also Read: WhatsApp Update : వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఒకే వాట్సాప్ లో రెండు అకౌంట్స్‌ యాక్సెస్ చేసుకోవచ్చట?