Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

  • Written By:
  • Updated On - March 23, 2024 / 04:35 PM IST

 

Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్ దండ‌కార‌ణ్యంలో మ‌రోసారి కాల్పులు(firing) చోటు చేసుకున్నాయి. శ‌నివారం భ‌ద్ర‌తా ద‌ళాలు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతిచెందారు. అలాగే ఇద్ద‌రు జ‌వాన్లు(Jawans) తీవ్రంగా గాయ‌ప‌డ్డారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘ‌ట‌న బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పీడియా అట‌వీ(Pedia forest) ప్రాంతంలో జ‌రిగింది. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన ముగ్గురు న‌క్స‌లైట్ల వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించలేదు.

Read  Also:Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టులో జర్మనీకి భారత్ వార్నింగ్

ఇదిలాఉంటే.. నాలుగు రోజుల క్రితం కూడా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చోటేతుంగాలి అట‌వీ ప్రాంతంలో కూడా ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.