Site icon HashtagU Telugu

CEC Press Meet : ప్రపంచంలోనే పెద్ద ఎలక్షన్స్.. 64.2 కోట్ల మంది ఓటేశారు : సీఈసీ

Cec Press Meet

Cec Press Meet

CEC Press Meet : 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్దవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేశారని.. ఇదొక ప్రపంచ రికార్డు అని ఆయన చెప్పారు. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు.  రేపు (జూన్ 4న) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈనేపథ్యంలో సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్‌కుమార్‌ కీలక వివరాలను తెలియజేశారు. ఈసారి మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు చేశారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా పటిష్ఠంగా జరగనుందన్నారు. అయితే ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి.

We’re now on WhatsApp. Click to Join

సీఈసీ వెల్లడించిన కీలక వివరాలివీ.. 

Also Read : Raveena Tandon : రవీనా టాండన్ మద్యం తాగారా ? క్లారిటీ ఇచ్చిన పోలీసులు