Soldiers Killed: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. అమరులైన ఇద్దరు సైనికులు..!

కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకారం.. ఇంటెలిజెన్స్ సమాచారం తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో కిష్త్వార్‌లోని చత్తారు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

Published By: HashtagU Telugu Desk
Soldiers Killed

Soldiers Killed

Soldiers Killed: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మధ్య రెండు చోట్ల భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కిష్త్వార్ జిల్లాలోని చత్తారు ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం (Soldiers Killed) పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అక్క‌డ ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

మరోవైపు కతువాలోని ఖండారా ప్రాంతంలో జరుగుతున్న మరో ఎన్‌కౌంటర్‌లో రైజింగ్ స్టార్ కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. వారి వద్ద నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)కి సమీపంలో ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల (జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024) సమయంలో విధ్వంసం సృష్టించడానికి చొరబాటు ద్వారా ఈ మందుగుండు సామగ్రిని ఉగ్ర‌వాదులు తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు.

కిష్త్వార్‌లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం

కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకారం.. ఇంటెలిజెన్స్ సమాచారం తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో కిష్త్వార్‌లోని చత్తారు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నైద్‌ఘం గ్రామం ఎగువ ప్రాంతంలోని పింగనల్ దుగ్గడ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. దాక్కున్న ఉగ్రవాదులు ఆకస్మికంగా జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు గాయపడ్డారు.

Also Read: Devara Team Chit Chat : దేవర కోసం రంగంలోకి దిగిన యంగ్ హీరోస్

చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు

భద్రతా దళాలు గాయపడిన సైనికులను చికిత్స కోసం ఆస్ప‌త్రికి తీసుకెళ్లాయి. అక్కడ ఇద్దరు సైనికులు చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. అమరవీరుల్లో నాయబ్ సుబేదార్ విపిన్ కుమార్, కానిస్టేబుల్ అరవింద్ సింగ్ ఉన్నారు. ఇప్పుడు పింగనల్ దుగ్డా అడవిలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఉగ్రవాదుల కోసం డ్రోన్ల సాయం కూడా తీసుకున్నారు. ఆ ప్రాంతమంతా భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు వస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. జూన్ 9న జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినప్పటి నుండి కథువాలో గరిష్ట ఉగ్రవాద కార్యకలాపాలు కనిపించాయి. దీంతో సమాచారం అందిన వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి భారత సైన్యానికి చెందిన రైజింగ్ స్టార్ కార్ప్స్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఖండారా ప్రాంతంలో ఉగ్రవాదులతో సైనికులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఇరువైపులా కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు.

  Last Updated: 14 Sep 2024, 07:23 AM IST