Site icon HashtagU Telugu

Breast Cancer Cases: రొమ్ము క్యాన్సర్.. పట్టణ మహిళల్లో ఈ క్యాన్స‌ర్‌ ఎందుకు పెరుగుతోంది?

Cancer Risk

Cancer Risk

Breast Cancer Cases: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ (Breast Cancer Cases) అత్యంత సాధారణ క్యాన్సర్‌గా మారింది. ఇటీవల టీవీ నటి హీనా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని చెప్పారు. ఈ వ్యాధి పెరుగుతున్న కేసులు ముందస్తుగా గుర్తించవలసిన అవసరాన్ని హైలైట్ చేశాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాద కారకాలు, లక్షణాలు.. స్క్రీనింగ్ గురించి సమాచారాన్ని కలిగి ఉండటం మహిళలకు ముఖ్యం. పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గ్రామీణ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

Also Read: Pani Puri Risk: పానీ పూరీతో క్యాన్సర్.. నిజమేనా?

రొమ్ము క్యాన్సర్‌పై నివేదిక

రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని మరో నాలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అదే సమయంలో గ్రామాల్లో నివసించే మహిళల కంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. 2025 నాటికి భారతదేశంలో 56 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఒక పరిశోధనలో వెల్లడైంది.

We’re now on WhatsApp : Click to Join

పట్టణ మహిళలు ఎందుకు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?

రొమ్ము క్యాన్సర్ రోగుల సంఖ్య ఇలాగే పెరిగితే 2025 నాటికి 56 లక్షల మంది దీని బారిన పడవచ్చు. రొమ్ము క్యాన్సర్ ముప్పు పట్టణ మహిళల్లో కంటే గ్రామీణ మహిళల్లో చాలా తక్కువ. పట్టణ ప్రజల జీవనశైలి, అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోకపోవడం, బిడ్డకు జన్మనివ్వడంలో జాప్యం వంటివి దీనికి అతిపెద్ద కారణాలని నిపుణులు చెబుతున్నారు. నగరంలోని శ్రామిక మహిళలు తమ పిల్లలకు పాలు ఇవ్వ‌లేక‌పోతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పెరగడానికి ఇదే అతిపెద్ద కారణ‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రొమ్ము క్యాన్సర్‌ను ఎలా నివారించాలి..?

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన చాలా అవసరమని పలువురు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. తద్వారా ప్రజలు మరింత సమాచారాన్ని పొందవచ్చు. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ రోగులు క్యాన్సర్ మెటాస్టాటిక్ దశతో బాధపడుతున్నారు. అంటే మహిళల్లో ఈ క్యాన్సర్ గురించి ఏమాత్రం అవగాహన లేదు. కాబట్టి, ఈ తీవ్రమైన సమస్యను ఎదుర్కోవటానికి మహిళలు అవగాహన కలిగి ఉండాలని నిపుణులు అంటున్నారు.

నోట్: పై సమాచారాన్ని ప‌లు క‌థ‌నాల ద్వారా సేక‌రించాం.