Blood Sugar: ఈ నాలుగు మార్పులు చేయండి…దెబ్బకు బ్లడ్ షుగర్ దిగొస్తుంది…!!

డయాబెటిస్ జీవనశైలి సమస్య. ఈ సమస్య ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల్లో అసమతుల్యం...ఒక్కోసారి బాగా పెరిగిపోవడం, లేదంటే తగ్గిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అందుకని రక్తంలో చక్కెరలను నియంత్రణలో పెట్టుకోవడం చాలా అవసరం.

  • Written By:
  • Updated On - August 6, 2022 / 09:56 AM IST

డయాబెటిస్ జీవనశైలి సమస్య. ఈ సమస్య ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల్లో అసమతుల్యం…ఒక్కోసారి బాగా పెరిగిపోవడం, లేదంటే తగ్గిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అందుకని రక్తంలో చక్కెరలను నియంత్రణలో పెట్టుకోవడం చాలా అవసరం. దీనికోసం లైఫ్ స్టైల్ పరంగా చేసుకోవల్సిన మార్పులు ఈ నాలుగున్నాయి. అవేంటో చూద్దాం.

శారీరక చర్యలు…
షుగర్ సమస్య బారిన పడినవారే కాదు…దీనికి దూరంగా ఉండాలనుకునేవారు కూడా శారీరక వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవాల్సిందే. ప్రతిరోజూ 40 నిమిషాల వరకు మోస్తరు స్థాయి వ్యాయామాలు చేయాలి. వారంలో కనీసం ఐదు రోజులు అయినా వీటిని ఆచరించారు. వేగంగా నడక, సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్ వ్యాయామాలు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలో జీవక్రియలు సక్రమంగా మారుతాయి. అప్పుడు చక్కెరలు నియత్రణలో ఉంటాయి.

బరువు తగ్గడం.
అధికబరువు మధుమేహానికి పెద్ద శత్రువు. కాబట్టి అధిక బరువుతో ఉంటే వెంటనే తగ్గించుకునేందుకు సంకల్పించాలి. శారీర వ్యాయామాలతో కొంత వరకు ఫలితం ఉంటుంది. బరువు తగ్గడం కోసం తినడం మానేస్తే మంచి కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి బదులుగా చక్కని పోషకాహారం తీసుకుంటూ..మంచి వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గవచ్చు.

ఆహారం.
సమతులాహారం మంచిది. ఎప్పుడూ ఒకే తరహా ఆహారం మంచిది కాదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తక్కువ ఫ్యాట్ ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే తీసుకునే ఆహారంలో పీచు ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా ముడి ధాన్యాలను తీసుకోవాలి. నూడుల్స్, పిజ్జా, ప్యాస్ట్రీలు, బర్గర్లు, చీజ్, స్వీట్లు, కేక్ లు, బ్రెడ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎక్కువ శాచురేటెడ్ ఫుడ్స్ ను తీసుకోకూడదు. నాలుగు చపాతీలు ఒకేసారి తినకూడదు. స్కిన్ లెస్ చికెన్ ను మితంగా తీసుకోవాలి. ఆల్కాహాల్ కు గుడ్ బై చెప్పేయాలి.

ఒత్తిళ్లు…
ఒత్తిడి పెరిగిపోయినా…షుగర్ నియంత్రణ తప్పుతుంది. రక్తపోటు పెరిగినా ఇద పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి. అంతేకాదు అప్పటివరకు రక్తపోటులేని వారి డయాబెటిస్ వచ్చిన తర్వాత కనిపిస్తుంది. ఒత్తిళ్లు ఎక్కువైతే గుండె జబ్బులు, స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలహీనం చేస్తుంది. కాబట్టి రోజులో ఎనిమిది గంటలపాటు నిద్రించాలి. ప్రాణాయామం, యోగ, ధ్యాన ప్రక్రియలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.