Site icon HashtagU Telugu

Masala Dinusulu: ఈ మసాలా దినుసులతో బరువు తగ్గించుకోవచ్చని మీకు తెలుసా?

Masala Dinusulu

Masala Dinusulu

బెల్లీ ఫ్యాట్ ఒక్కసారి పెరిగింది అంటే తగ్గించుకోవడం అంత సులువైన విషయం కాదని చెప్పాలి. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ని అలాగే అధిక బరువును తగ్గించుకోవడానికి కొన్ని మసాలా దినుసులు బాగా ఉపయోగపడతాయట. ఇంతకీ ఆ మసాలా దినుసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈ మసాలా దినుసుల్లో విటమిన్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్య తగ్గడమే కాకుండా బరువు తగ్గుతారట పెరుగుతున్న ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే గంట ముందు ఒక గ్లాసు నీటిలో దాల్చిన చెక్కను మరిగించి ఆ నీరు సగం కాగానే దించేసి తాగాలట.

ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుందని, అలాగే సీజనల్ వ్యాధులకు శరీరం దూరంగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని మీరు రెగ్యులర్ గా తాగడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంటుందట. కాగా త్రిఫలాన్ని తీసుకోవడం వల్ల శరీరం అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉంటుంది. దీన్ని పౌడర్, జ్యూస్, కషాయంగా కూడా తీసుకోవచ్చట. ఈ ఔషధం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఒత్తిడి వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది జీవక్రియను పెంచి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందట. ఇందుకోసం త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చట. అయితే మీకు కావాలంటే మీరు దీన్ని కషాయాన్ని కూడా తయారు చేయవచ్చట. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుందట.

తేనె, దాల్చిన చెక్కతో కలిపిన పొడిని కూడా తాగవచ్చని చెబుతున్నారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీకి దూరంగా ఉంటారట. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మెంతులు మన శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని తీసుకోవచ్చు. లేదా వీటిని పొడిగా కూడా తినవచ్చు. ఊబకాయానికి దూరంగా ఉండాలంటే 1 గ్లాసు నీటిలో అర టీస్పూన్ మెంతికూర, నల్ల మిరియాలు, పసుపు, చిన్న, చిక్కటి యాలకులు కలిపి కషాయం తయారుచేసుకోవాలి. నీరు సగం కాగానే తాగాలి. ఉదయాన్నే పరగడుపున కూడా తాగొచ్చు.

ఇది మిమ్మల్ని ఊబకాయం సమస్యకు దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు.
అలాగే చింతపండులో విటమిన్లు, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. చింతపండు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే హైడ్రోసిట్రిక్ మూలకం శరీరాన్ని తేమ నుంచి కాపాడుతుంది. నిజానికి చింతపండు అతిగా తినడాన్ని కూకడా తగ్గిస్తుందట. కొద్దిగా చింతపండును తీసుకుని 2 గ్లాసుల నీటిలో నానబెట్టాలట. రాత్రంతా నానబెట్టిన తర్వాత చింతపండును ఉదయం వడగట్టి దాని రసం తాగాలి. దీనికి తేనె, బ్లాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చట. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని,బరువును కూడా తగ్గిస్తుందని, కావాలనుకుంటే చింతపండును చింతపండు పచ్చడిగా చేసుకుని కూడా తినవచ్చని చెబుతున్నారు.