ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తరచుగా పండ్లు కాయగూరలు పప్పు ధాన్యాలు వంటివి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా తరచుగా పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే పండ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ అలా అని రాత్రిపూట కొన్ని రకాల పండ్లు తినడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. మరి రాత్రి సమయంలో ఎలాంటి పండ్లు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలనీ చెబుతున్నారు. ఎందుకంటే చాలా రకాల పండ్లలో వాటర్ ఉంటుంది. కాబట్టి పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగాల్సిన అవసరం లేదు. అంతేకాక పండ్లనను తిన్న వెంటనే నీరు నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయట. అలాగే మీ శరీరం పండ్ల నుంచి పోషకాలను గ్రహించకుండా పాక్షికంగా నిరోధిస్తుందట. ఫ్రిజ్ లో లేదా బయట ఎక్కువ సేపు లేదా రోజుల తరబడి కట్ చేసిన పండ్లను తినకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ఇప్పుడైనా కూడా పండ్లు, కూరగాయలు కోసిన వెంటనే వాడాలట. లేదంటే వాటి క్వాలిటీ అంతా కోల్పోయి నిరుపయోగంగా మారిపోతాయట.
అంతేకాకుండా కోసిన పండ్లలోకి క్రిములు ప్రవేశించి అవి మన శరీరంలోకి చేరే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కొంతమంది పండ్లను జ్యూస్ తో కలిపి తింటుంటారు. కానీ పండ్లను వీలైనంత వరకు అలాగే తినడమే మంచిదని చెప్తున్నారు. మీరు పండ్ల రసాన్ని తయారు చేస్తున్నప్పటికీ మీరు దానిలో చక్కెరను ఎక్కువగా వేయకూడదట. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. జ్యూస్ ను ఇష్టపడినా ఎప్పటికప్పుడు పండ్లు తినడం అలవాటు చేసుకుంటేనే పోషకాలు లభిస్తాయట. రాత్రిపూట పండ్లను తినే అలవాటు చాలా మంది ఉంటుంది. అయితే ఇది మంచి అలవాటు కాదని కొందరు చెప్తుంటారు. ఎందుకంటే రాత్రిపూట పండ్లను తింటే మీ నిద్రకు భంగం కలుగుతుంది. అంటే అన్ని పండ్లు సహజంగా తీయగా ఉంటాయి. ఈ చక్కెర మన శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. దీనితో మీరు సరిగ్గా నిద్రపోలేరు.