Site icon HashtagU Telugu

Pregnant Tips: గర్భిణీ స్త్రీలు పడుకునేటప్పుడు పొరపాటున కూడా అలాంటి తప్పులు అస్సలు చేయకండి?

Pregnant Tips

Pregnant Tips

సాధారణంగా స్త్రీలు గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతూ ఉంటారు. తిండి విషయంలో చేసే పనుల విషయంలో అలాగే చివరికి పడుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. చాలామంది గర్భిణీ స్త్రీలు ఎలా పడుకోవాలో తెలియక ఇష్టం వచ్చినట్టుగా పడుకోవడంతో వారితో పాటు కడుపులో బిడ్డకు కూడా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. బొడ్డుతాడు తల్లీ, బిడ్డను కలుపుతుంది. ఇది గొట్టం లాంటి నిర్మాణంలో ఉంటుంది. ఈ తాడు ద్వారానే బిడ్డకు తల్లి నుంచి ఆహారం, ఆక్సిజన్ సరఫరా అవుతాయి. అయితే ఈ తాడు పొడుగ్గా ఉంటుంది.

బిడ్డ కదలికలు, గర్భిణీ స్త్రీలు పడుకునే కొన్ని భంగిమల వల్ల ఈ తాడు బిడ్డ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇది బిడ్డకు చాలా ప్రమాదకరం. అయితే గర్భిణులు పడుకునే విధానం కూడా ఇందుకు కారణమవుతుందట. మరి ఇలా జరగకూడదంటే గర్భిణులు ఎలా పడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీ ఎప్పుడూ కూడా ఎడమ వైపు తిరిగే పడుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు రక్త సరఫరా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే లేచేటప్పుడు కూడా ఎడమ వైపు తిరిగే లేవాలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు అకస్మత్తుగా లేవకూడదు.

నెమ్మదిగా లేచిన తర్వాత లేచి నిలబడాలి. గర్భిణులు ప్రెగ్నెన్సీ సమయంలో 5 నెలల వరకు ఏ భంగిమలోనైనా నిద్రపోవచ్చు. కానీ 5 నెలలు పడిన తర్వాత వీలైనంత వరకు ఒక వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా వీళ్లు ఎడమవైపుకు తిరిగే నిద్రపోవడం మంచిది. అలాగే నిద్రపోయేటప్పుడు కాళ్ల మధ్యన దిండు పెట్టుకోవడం మంచిదట. అంతేకాకుండా గర్భం దాల్చిన 5 నెలల తర్వాత గర్భిణులు వెల్లకిలా పడుకోకూడదు.

ఇలా పడుకుంటే బిడ్డ బరువు గర్భాశయంపై ఒత్తిడిని తెస్తుందట. ఇది శిశువుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. అందుకే గర్భిణీ స్త్రీలు ఐదో నెల నుంచి బోర్లా, వెల్లకిలా నిద్రపోకుండా ఉండాలట. సాధారణంగా గర్భధారణ సమయంలో ప్రతి గర్భిణీ స్త్రీ జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే గర్భధారణ సమయంలో అన్ని రకాల సమస్యలు శిశువుతో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు పడుకునేటప్పుడు కొన్ని రకాల విషయాలను తప్పనిసరిగా గుర్తించుకోవాలని చెబుతున్నారు.