Curd Benefits: పెరుగు తిన్న తర్వాత ఈ పదార్థాలను పొరపాటున కూడా అస్సలు తినకండి?

పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ఉదయం అలాగే రాత్రి సమయంలో కచ్చితంగా ఒక్కసారై

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 12:10 PM IST

పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ఉదయం అలాగే రాత్రి సమయంలో కచ్చితంగా ఒక్కసారైనా పెరుగును తీసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా మందికి పెరుగు లేకుండా ముద్ద కూడా దిగదు. మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా పెరుగుతోనే తింటూ ఉంటారు. పెరుగును తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పెరుగు తినడం మంచిదే కానీ పెరుగుతో పాటు ఏడు రకాల పదార్థాలు కలిపి తింటే డేంజర్ లో పడక తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగు అందానికి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. కాగా రోజు ఒక గిన్నె పెరుగు తీసుకోవడం వల్ల అది మనల్ని హైడ్రైట్ గా ఉంచడమే కాకుండా మన ఎనర్జీ లెవెల్స్ ని కూడా పెంచుతుంది. అయితే పెరుగు రాత్రులు మాత్రం తినకూడదని చాలా మంది అంటూ ఉంటారు.

రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. పెరుగు రాత్రి తింటే జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే రాత్రి వేళలో పెరుగు అస్సలు తినకూడదు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుంది. పెరుగు ఉల్లిపాయ కాంబినేషన్ వేసవి రోజుల్లో తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఉల్లిపాయ వేడి చేస్తుంది. పెరుగు చల్లగా ఉంటుంది. వీటిని కలిపి తింటే ఎనర్జీలు గ్యాస్ వల్ల వాంతులు వస్తాయి. అందుకే ఈ రెండింటిని ఎప్పుడు కలిప తినకూడదు.అలాగే మసాలాలు మీ శరీరంలో వేడిని పెంచుతాయి. పెరుగు చల్లదనాన్ని పెంచుతుంది.

కాబట్టి పెరుగు ప్రభావం దానిని ఎదుర్కోవడానికి సరిపడకపోవచ్చు. ఇది యాసిడిటీ లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది. అలాగే చేపలు కొన్ని ప్రోటీన్ లను కలిగి ఉంటాయి. అవి పెరుగుతో కలిసినప్పుడు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. సరైన జీరణ క్రియ, పోషకాల షోసణను నిర్ధారించడానికి ఈ రెండింటిని విడివిడిగా తీసుకోవడం మంచిది. పాలు, పెరుగు పాల ఉత్పత్తులను కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపులో భారం అజీర్ణం కలగవచ్చు. పుచ్చకాయలు ,అరటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పెరుగులో చేరిన ఎంజైములను పలుచన చేస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణక్రియకు దారితీస్తాయి. ఈ పండ్లను పెరుగుతో కలిపి అస్సలు తినకండి. ఎందుకంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే పెరుగు మామిడికాయ అనేది కలిపి తింటూ ఉంటారు. చాలామంది పెరుగుతో పాటు మామిడి పండ్లను తినకూడదు. ఎలర్జీలు చర్మ సమస్యలు తలెత్తవచ్చు. అలాగే పెరుగు నూనె పదార్థాలు పెరుగు తిన్న వెంటనే నూనెలో వేయించిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఒకవేళ తీసుకుంటే అజీర్తి సమస్యలు వస్తాయి. పెరుగు మినప్పప్పు, పెరుగు తిన్న వెంటనే మినపప్పుతో చేసే వంటకాలు తినకండి. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం పెరుగుతుంది. ఏదేమైనా పెరుగుని పెరుగులాగే మీరు తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం వేళలో తీసుకుంటేనే మంచిది.