Soaked Raisins: పాల‌లో నాన‌బెట్టిన ఎండుద్రాక్ష‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

దీని కోసం మీరు 1 గ్లాసు పాలలో 8-10 ఎండుద్రాక్షలను నానబెట్టాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం గోరువెచ్చని పాలు తాగాలి.

Published By: HashtagU Telugu Desk
Soaked Raisins

Soaked Raisins

Soaked Raisins: ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మన ఆహారంలో పోషకాహారం సమృద్ధిగా ఉన్నట్లయితే రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషణకు మూలం. బాదం, జీడిపప్పు, పిస్తా ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోవాలి! అయితే ఎండుద్రాక్ష (Soaked Raisins) ప్రయోజనకరమైన లక్షణాల గురించి మీరు ఎప్పుడైనా చదివారా? ఎండు ద్రాక్షను పాలలో నానబెట్టి తింటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

ఎండుద్రాక్షలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే మలబద్ధకం, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. పాల‌లో కలిపి తాగడం వల్ల పొట్ట చల్లబడి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

గుండె ఆరోగ్యం

ఎండుద్రాక్ష, పాలు కలిపి తీసుకోవ‌డం ద్వారా మనకు ఒమేగా -3, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి గుండె జబ్బుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఎండుద్రాక్ష పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడేవారు రోజూ ఎండుద్రాక్షను తీసుకోవాలి.

Also Read: YS Jagan: లండ‌న్‌లో లుక్ మార్చిన వైఎస్ జ‌గ‌న్‌!

ఎముకలు బ‌ల‌ప‌డ‌తాయి

పాలలో కాల్షియం, ఎండుద్రాక్షలో ఐర‌న్‌.. ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఎండుద్రాక్షలో ఉండే ఐరన్ శరీరంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. ఆర్థరైటిస్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది.

రక్తపోటు నియంత్ర‌ణ‌

పాలు, ఎండుద్రాక్ష రెండింటిలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఎండుద్రాక్ష, పాలు కలిపి తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె జబ్బులు, పెరిగిన కొలెస్ట్రాల్ సమస్యను కూడా నివారిస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఎండుద్రాక్షలో సహజ నూనెలు ఉంటాయి. ఇవి మన చర్మానికి పోషణనిస్తాయి. పాలు- ఎండుద్రాక్షలను కలిపి తినడం వల్ల పొడి, మొటిమలు, ఫైన్ లైన్స్ సమస్యలు రావు. చర్మంపై నల్ల మచ్చలు ఉన్నవారు కూడా ఎండు ద్రాక్షను పాలతో కలిపి తీసుకోవాలి.

ఎలా తాగాలి?

దీని కోసం మీరు 1 గ్లాసు పాలలో 8-10 ఎండుద్రాక్షలను నానబెట్టాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం గోరువెచ్చని పాలు తాగాలి.

  Last Updated: 16 Jan 2025, 10:45 PM IST