Fruits: బ్రేక్ ఫాస్ట్ మానేసి పండ్లు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

చాలామంది ఉదయం పూట ఆహారం చేయకుండా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారు. కొందరు ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేయాలని అంటారు. మరికొందరేమో బరువు తగ్గడానికి అ

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 08:50 PM IST

చాలామంది ఉదయం పూట ఆహారం చేయకుండా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారు. కొందరు ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేయాలని అంటారు. మరికొందరేమో బరువు తగ్గడానికి అల్పాహారం మానేయాలని చెబుతూ ఉంటారు. అయితే ఉదయం అల్పాహారానికి బదులు పండ్లు ఆరోగ్యకరమైనవే కదా అని తినేస్తుంటారు. బ్రేక్‌ ఫాస్ట్‌కు బదులు రకరకాల పండ్లు తినేస్తుంటారు. అయితే ఇలా అల్పాహారానికి బదులు పండ్లు తినడం వల్ల లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పండ్లు తినడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. పండ్లలోని పోషకాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. అలాగే పండ్లలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి పండ్లు మంచివని చెప్పవచ్చు. అల్పాహారం తినకపోవడం వల్ల కార్బోహైడ్రేట్లు శరీరానికి అందవు. శరీరానికి శక్తిని ఇవ్వడంలో వీటి పాత్ర చాలా కీలకం. అల్పాహారం తినకపోవడం వల్ల రోజంతా ఆకలి వేస్తుంది. దీని వల్ల పగటిపూట ఎక్కువ తినడం, బరువు పెరగడం జరుగుతుంది.

అల్పాహారం మానేయడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటే, పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి సమతుల్య ఆహారంలా అన్ని పోషకాలను అందించలేవు. సరైన అల్పాహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఫైబర్, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ ఉంటాయి. రాత్రి దాదాపు 7-9 గంటల ఉపవాసాన్ని బ్రేక్ చేస్తుంది. నిద్రలేచిన తర్వాత చేసే మొదటి భోజనం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. ఉదయం పూట అల్పాహారం మానేసి పండ్లు మాత్రమే తింటే, రక్తంలో చక్కెర స్థాయిలు స్వల్పంగా తగ్గుతాయి. ఎందుకంటే శరీరానికి పిండి పదార్థాల నుండి వచ్చే గ్లూకోజ్ రాదు కాబట్టి ఉదయంపూట అల్పాహారం తినడం మానేసి కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఉదయం పూట పండ్లు మాత్రమే తినడం వల్ల రోజంతా ఆకలిగా అనిపిస్తుంది. దీని వల్ల పగటి పూట లేదా రాత్రి పూట ఎక్కువగా తినేస్తుంటారు..