Fact Checked By boomlive
ప్రచారం : రాష్ట్రపతి భవన్లో తొలిసారిగా వివాహం జరిగింది.
వాస్తవం : ఈ వాదన తప్పు అని BOOM గుర్తించింది. రాష్ట్రపతి భవన్ అధికారిక డిజిటల్ ఫొటో లైబ్రరీలోని ఫోటోలను మేం చెక్ చేశాం. అధికారిక రాష్ట్రపతి నివాసం గతంలో అనేక వివాహాలకు వేదికగా నిలిచిందని గుర్తించాం.
Also Read :National Parties Vs Incomes: ఆదాయంలో టాప్-3 జాతీయ పార్టీలపై ఏడీఆర్ సంచలన నివేదిక
భారతదేశ చరిత్రలో తొలిసారిగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహం జరిగిందని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి, ప్రచురించాయి.
వాస్తవం ఏమిటంటే.. గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రపతి భవన్ అనేక వివాహాలకు వేదికగా నిలిచిందని BOOM నిర్ధారించగలిగింది. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో 2016 వరకు ఫొటో ఆర్కైవ్లు అందుబాటులో ఉన్నాయి.
ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్లో జరిగిన పూనమ్ గుప్తా(Fact Check) వివాహం గురించి మీడియా సంస్థలు తప్పుగా సమాచారాన్ని నివేదించాయి. రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా పూనమ్ గుప్తా నిలిచారని ఆయా కథనాల్లో ప్రస్తావించారు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో అధికారిణిగా ఉన్న గుప్తా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి (PSO) బృందంలో సభ్యురాలిగా ఉన్నారు.
2025 ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకున్న పూనమ్ గుప్తా, అక్కడ మ్యారేజ్ చేసుకున్న తొలి వ్యక్తి అని వార్తా సంస్థలు మిర్రర్ నౌ, న్యూస్ ఎక్స్, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ టీవీ కథనాలను ప్రచురించాయి.
Also Read :Places Of Worship Case: ‘‘ఇక చాలు..’’ ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి వివాహం ఇదేనని అనేక మీడియా సంస్థలు తప్పుగా నివేదించాయి. వీటిలో ఇండియా టుడే , న్యూస్ ఎక్స్ , మిర్రర్ నౌ , సిఎన్బిసి టివి 18 , డెక్కన్ హెరాల్డ్ , రిపబ్లిక్ టివి , ఈటీవీ భారత్ , ది ఎకనామిక్ టైమ్స్ , టైమ్స్ ఆఫ్ ఇండియా , వార్త భారతి , మనీ కంట్రోల్ మరియు టైమ్స్ నౌ ఉన్నాయి .
PTI ఒక వీడియో నివేదికను ప్రసారం చేసింది. HT సిటీ ఢిల్లీ వివాహంపై తప్పుడు వాదనతో ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది.
వాస్తవ తనిఖీలో ఏం తేలిందంటే..?
- ఈ ప్రచారంలో వాస్తవికత లేదని బూమ్(BOOM) గుర్తించింది. అది అబద్ధమని, రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో గతంలో చాలా వేడుకలు జరిగాయని నిర్ధారించింది. రాష్ట్రపతి భవన్ వెబ్సైట్లోని డిజిటల్ ఫోటో లైబ్రరీని ‘బూమ్’ తనిఖీ చేయగా, గతంలో ఆ ప్రాంగణంలో జరిగిన వివిధ వివాహాలు, రిసెప్షన్ల ఫొటోలు కనిపించాయి.
- 2016 అక్టోబర్లో, 2017 ఏప్రిల్లో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక వివాహానికి హాజరై, ఆ జంటతో కలిసి ఫోటో దిగిన ఫోటోలను మేం గుర్తించాం.
- 2018 ఫిబ్రవరిలో ప్రెసిడెంట్స్ ఎస్టేట్లో జరిగిన వివాహానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరైన ఫోటోలను కూడా మేం గుర్తించాం.
- కేంద్ర ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ‘PIB ఫ్యాక్ట్ చెక్’.. “రాష్ట్రపతి భవన్ మొదటి నుంచే అనేక వివాహాలకు వేదికగా ఉంది” అని ఒక వివరణను విడుదల చేసింది. ఈ అంశంపై మీడియా తప్పుడు నివేదికలను ప్రచురించిందని స్పష్టం చేసింది.