హిందువులు పసుపు, కుంకుమలను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలు అయితే పసుపు కుంకుమను ఐదవతనంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన స్త్రీలు నుదుటున కుంకుమ ధరించారంటే ఆమెకు పెళ్లయిందని, భర్త ఉన్నాడని అర్థం. అందుకే పెళ్లయిన స్త్రీలు తప్పకుండా నుదుటున కుంకుమను ధరిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటన కుంకుమ ధరించాలని సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవి ఆజ్ఞాపించిందని మన పురాణాలు చెబుతున్నాయి.
అయితే పెళ్లి కాని అమ్మాయిలు నుదుటున కుంకుమ ధరించరు అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన స్త్రీలు మొత్తం 5 స్థానాలలో కుంకుమను ధరిస్తారు. మరి స్త్రీలు కుంకుమ ధరించే ఆ ఐదు స్థానాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాపిట్లో ఒక బొట్టు పెట్టుకోవాలి. సీతాదేవి పాపిట్లో సింధూరం ధరించి, దానిపై పాపిడిబిళ్ళను ధరించేదట. అయితే ఆంజనేయస్వామి ‘ఎందుకమ్మా సింధూరం ధరిస్తున్నావు?’ అని అడిగితే, ‘నా స్వామి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని, నా వైపు ఆకర్షితుడవుతాడని’ చెప్పిందట.
స్వామి తన శరీరమంతా సింధూరం పూసుకోవడం అలవాటుగా చేసుకుని శ్రీరామచంద్రుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. అలాగే కనుబొమల మధ్యన కుంకుమ పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు పెరగడంతో పాటుగా నిత్య సుమంగళిగా ఉంటారట. అలాగే కంఠం దగ్గర, వక్షస్థలం మధ్యన ఇంకా నాభి దగ్గర కూడా కుంకుమను ధరిస్తారు. అయితే ఈ అయిదు చోట్ల కుంకుమ ధరించిన స్త్రీకి వైధవ్యం లేకుండా, భర్త కన్నా ముందే తానే సౌభాగ్యవతిగా వెళ్లిపోవడానికి దోహదపడతాయట. అయితే సీతాదేవి కూడా ఇలా ధరించడం వలనే రాముని కన్నా ముందే తన అవతారాన్ని చాలించింది.
