Lord Shiva : శ్రావణ మాసంలో పరమశివుడు భూమ్మీదకు వచ్చి, ఏ క్షేత్రంలో కొలువై ఉంటాడో తెలుసా..?

దేవశయని ఏకాదశి అంటే దేవతల నిద్రా కాలం ప్రారంభం. శివ పురాణం ప్రకారం, విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు, ప్రపంచ నియంత్రణ శివుని చేతిలో ఉంటుంది. చాతుర్మాస నాలుగు మాసాలలో, సృష్టి యొక్క మొత్తం బాధ్యతను శివుడు చూసుకుంటాడు.

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 06:00 AM IST

దేవశయని ఏకాదశి అంటే దేవతల నిద్రా కాలం ప్రారంభం. శివ పురాణం ప్రకారం, విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు, ప్రపంచ నియంత్రణ శివుని చేతిలో ఉంటుంది. చాతుర్మాస నాలుగు మాసాలలో, సృష్టి యొక్క మొత్తం బాధ్యతను శివుడు చూసుకుంటాడు. శ్రావణ మాసం 29 జూలై 2022 నుండి ప్రారంభమైంది. శివుడు కైలాసాన్ని విడిచిపెట్టి ఈ సమయంలో భూమికి వస్తాడని. ఇక్కడ నుండి విశ్వాన్ని పరిపాలిస్తాడని నమ్ముతారు. శ్రావణ మాసంలో పరమశివుడు భూమిపై ఎక్కడ కొలువై ఉంటాడో తెలుసా..?

పురాణాల ప్రకారం, శివుడు తన కుటుంబంతో సహా శ్రావణ మాసంలో తన అత్తగారిని దర్శించుకుంటాడు. హరిద్వార్‌లోని కంఖాల్‌లో శివ అత్తగారి ఇల్లు ఉంది. ఇక్కడి దక్ష దేవాలయంలో శివుడు, సతీదేవి వివాహం చేసుకున్నారని ప్రతీతి.

శివ పురాణం ప్రకారం, సతి తండ్రి దక్ష ప్రజాపతి కంఖల్ వద్ద ఒక ప్రసిద్ధ యాగాన్ని నిర్వహించాడు. సతీదేవి తండ్రికి మహాదేవునిపై కోపం రావడంతో ఈ యాగానికి తన అల్లుడు శివుడుని ఆహ్వానించలేదు. ఇక్కడే సతీదేవి తన తండ్రి శివుడిని అవమానించినందుకు యాగంలో తన ప్రాణాలను బలితీసుకుంది. నిప్పులు కురిపిస్తున్న సతీదేవిని చూసి, దుఃఖంలో మునిగిపోయిన శివుడు తన ఝటాఝూటాన్ని నేలకేసి కొట్టాడు. అప్పుడే ఉగ్రరూపమైన శివ స్వరూపుడైన వీరభద్రుడు అవతరించాడు. అతడు సతీదేవి తండ్రి అయిన దక్షుడి తలను నరికివేసాడు.

దేవతల అభ్యర్థనపై మేక తల పెట్టి దక్ష రాజుకు శివుడు పునర్జన్మ ఇస్తాడు. దక్ష ప్రజాపతి తన అహంకారానికి క్షమాపణ చెప్పి, ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శివుడిని ఇక్కడే ఉండి, తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుని నుండి వాగ్దానం పొందాడు. అప్పటి నుండి శ్రావణ మాసం వచ్చినప్పుడు శివుడు భూలోకానికి వస్తాడని మరియు ప్రపంచాన్ని పరిపాలిస్తాడని నమ్ముతారు. శ్రావణ మాసం అంతా దక్షేశ్వరుని రూపంలో శివుడు కంఖాల్‌లో ఉంటాడు. ఈ కారణంగానే శ్రావణ మాసంలో పరమశివుని ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది.