Site icon HashtagU Telugu

Lakshmi-Ganesh: దీపావళి రోజు లక్ష్మితో పాటు వినాయకుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

Laxmi Ganesh Puja Diwali2 654f5781432e0

Laxmi Ganesh Puja Diwali2 654f5781432e0

దీపావళి పండుగ రోజు ప్రతీ ఒక్కరూ ఇంటి నిండా దీపాలను వెలిగించి చాలా ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్క ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. వినాయకుడిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సౌభాగ్యం, అదృష్టం కలుగుతాయి. అంతేకాక ఈ పూజ శాంతి, సౌభాగ్యం, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ 31 న జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని, వినాయకుడిని కలిపి పూజిస్తారు.

అయితే లక్ష్మితో పాటు గణేష్ ని కూడా ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీపావళి పండుగను పురస్కరించుకుని లక్ష్మీదేవిని, వినాయకుడిని నిష్టగా పూజిస్తారు. లక్ష్మీ దేవి, వినాయకుడిని పూజించడం వల్ల భక్తుల ఇంటికి సంపద వస్తుందని నమ్ముతారు. దీపావళి పూజను రాత్రి నిర్ణీత సమయంలో చేస్తారు. భక్తులు నిష్టగా పూజ చేస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. లక్ష్మీదేవి సంపదకు దేవగా పరిగణించడం వల్ల అమ్మవారికి అహంకార భావన వచ్చింది. ఈ అహంకారానికి ముగింపు పలకడానికి ఒక స్త్రీ తల్లి అయినప్పుడు మాత్రమే ఆమె జీవితం పరిపూర్ణమవుతుందని విష్ణువు అమ్మవారికి చెప్పాడట.

అది విన్న లక్ష్మీదేవి నిరాశ చెంది పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఈ విషయాలన్నింటినీ చెప్తుందట. అంతేకాదు పార్వతీ మాత కొడుకును ఇవ్వమని కూడా కోరిందట. పార్వతీదేవికి, లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఒకే చోట ఉండదని తెలుసు. అందుకే పార్వతీ దేవి తన కొడుకు వినాయకుడిని ఆమెకు ఇచ్చిందట. దీంతో లక్ష్మీదేవికి ఎంతో ఆనందం కలిగిందట. అందుకేలక్ష్మీదేవి కంటే ముందు వినాయకుడిని పూజిస్తారు. అందుకే దీపావళి రోజున వీరిద్దరికీ కలిపి పూజ చేస్తారు. ముందుగా వినాయకుడిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.