Site icon HashtagU Telugu

Spirituality: ఆస్తిపాస్తులు అమాంతం పెరగాలంటే ఈ పరిహారం పాటించాల్సిందే!

GST 2.0

GST 2.0

ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. పరిస్థితులు తారుమారు అయినప్పుడు కోటీశ్వరులు కూడా కొన్ని కొన్ని సార్లు దివాలా తీయవచ్చు. కొన్ని కొన్ని సార్లు అదృష్టం మారి రాత్రికి రాత్రే కలిసి వచ్చి బీద వాళ్ళు కాస్త కోటీశ్వరులుగా కూడా మారవచ్చు. అయితే ఇలా అదృష్టం కలిసి రావాలి అంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… గురువారం రోజున 5 రాగిచెట్టు ఆకులను తీసుకోవాలి. వాటిపై గంధంతో బొట్టులాగా పెట్టాలి. ఎక్కడైతే నీరు పారుతుందో, ఆ పారే నీటిపై ఈ రాగి ఆకులను పెట్టాలి.

ఇలా మూడు గురువారాలు పాటిస్తే ఆస్థులను కొనుక్కునే సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చట. గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన యోగాన్నీ గురుపుష్య యోగము అని అంటారు. ఏరోజైతే గురు పుష్యమి వస్తుందో అదే రోజు పరిహారాన్ని చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులోనైనా ఆస్థులు త్వరగా రావాలి అని అనుకున్నట్లైతే సాయంత్రం సూర్యాస్థమయ సమయంలో 1/2 లీటరు ఆవు పాలను తీసుకోవాలి. ఆ పాలలో 9 తేనె చుక్కలను వేయాలి. ఇంటి పై భాగానికి వెళ్లి అన్ని దిక్కుల్లో ఈ పాల చుక్కలను చల్లాలి. ఇంట్లో వున్న అన్ని గదుల్లో ఈ పాల చుక్కలను చల్లుతూ వుండాలి. మిగిలిన పాలను ఇంటి ముందు ధారలాగా పొయ్యాలి. గురువారం సాయంత్రం, శుక్రవారం సాయంత్ర వీలయినప్పుడల్లా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా 21 సార్లు చేస్తే ఆస్తులు కొనే యోగం తొందరగా లభిస్తుందట. ఆదివారం ఆవుకు బెల్లాన్ని తినిపిస్తూ వుంటే కూడా ఆస్థులు తొందరగా కొనుక్కునే యోగం కలుగుతుందట.

అమావాస్య రోజున ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. ఇలా చేసినట్లయితే ఆస్థులు కొనే యోగం తొందరగా వస్తుందట. గురువారం ఏదైనా ఆలయానికి వెళ్లి తులసి మొక్క ఎక్కడ వుందో చూడాలి. ఆ మొక్క దగ్గరలో పెరిగిన గడ్డిని కోసి బట్టలో చుట్టి ఇంటికి తెచ్చుకోవాలి. ఆ మూటకు ధూపాన్ని వేస్తూ వుంటే మీకు ఆస్థులు కొనే యోగం పెరిగిపోతూ వుంటుందట. రంగురంగుల గవ్వలను ఏరి తెచ్చుకోవాలి. వాటిని పొడి చేసుకొని, ఎవరినుంచైతే ఆస్థులు రావాలి అని అనుకుంటున్నారో వారి ఇంటిముందు ఈ గవ్వల పొడిని చల్లాలి. ఇలా ఏడు సార్లు చేయాలని తాంత్రిక శాస్త్రంలో చెప్పారు. ఈ పరిహారంతో వాళ్లంతట వాళ్లే వచ్చి వాళ్ల ఆస్థులను తిరిగి ఇస్తారట. ప్రతీ ఇంట్లో కూడా మారేడు మొక్క తప్పకుండా వుండాలి. ఇంటి ఆవరణలో మారేడు మొక్క పెంచుకొని ప్రతీ శుక్రవారం ఆ మొక్క దగ్గర దీపాన్ని పెట్టి పూజచేస్తే లక్ష్మీ దేవి ఘల్లు ఘల్లు మనుకుంటూ ఇంట్లోకి వస్తుందట. ప్రతీ ఒక్కరు ఇంట్లో కుండీలో కలబంద మొక్కను తప్పకుండా పెంచుకోవాలి. కలబంద చెట్టు దగ్గర సాయంత్రం సమయంలో అగరబత్తీలు వెలిగించి, హారతి ఇచ్చినట్లైతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందట. ఇంటి ఆవరణలో ఈ మొక్కలను పెంచుకుంటే ధనపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా వుంటాయటీ.