జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార ఉచిత దర్శనంకు రోజుకు 50వేలు వంతున మొత్తం అయిదు లక్షల టోకెన్లు తిరుపతి (Tirupati) లో 9 కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. జనవరి 2023 ఒకటవ తేదీ (ఆదివారం) టోకెన్ల జారీ మొదలైతే అయిదు లక్షల టోకెన్లూ అయిపోయే వరకు అన్ని కేంద్రాల్లో 24 గంటలూ ఇస్తూనే ఉంటారు. తిరుమలలోని కేంద్రంలో మాత్రం తిరుమలలో నివాసం ఉన్న ఆదార్ కార్డు ఉన్న వారికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు కోసం తిరుమలకు వెళ్ళకండి. తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఎవ్వరికైనా టోకెన్లు జారీ చేస్తారు.
మొదటి ఆరు కేంద్రాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కి దగ్గర ఉంటాయి
శ్రీవారి సేవలో నారద పీఠం పంపే టీటీడీ గురించిన తాజా మెసేజ్ లు, నిత్య పంచాంగం కోసం 9392877277 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయండి.
Also Read: Shunyamasam : శూన్య మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?