Guru Vakri 2022: తిరోగమనంలో “గురుడు”.. 3 రాశులవారిపై ధన వర్షమే!!

ఈ పరిణామం వల్ల 3 రాశులకు చెందిన వాళ్ళపై వచ్చే 4 నెలల్లోగా ధన వర్షం కురవబోతోంది!!

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 10:30 AM IST

ఒక గ్రహం గతి మారబోతోంది..
ఈ పరిణామం వల్ల 3 రాశులకు చెందిన వాళ్ళపై వచ్చే 4 నెలల్లోగా ధన వర్షం కురవబోతోంది!! ఇంతకీ ఆ గ్రహం ఏమిటి ? ఆ రాశి ఏమిటి ? అనేది తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే!!

పైన చెప్పిన వివరాలన్నీ దేవగురువు బృహస్పతికి చెందినవి. నవ గ్రహాల్లో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గురు గ్రహము తనకున్న బలం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలకు అధిపతి. ఆయన అనుగ్రహం లేనిదే ఏ పనినీ చేయలేము. కుమారుడు, జీవిత భాగస్వామి, సంపద, విద్య, కీర్తి కారకుడిగా జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది.
జూలై 29వ తేదీ .. అంటే ఈ రోజు నుంచి మరో 4 నెలల పాటు (నవంబరు 24 వరకు)
బృహస్పతి వక్రంలోకి వస్తాడు. వక్రంలోకి వెళ్లడం అంటే.. ముందుకు కాకుండా వెనక్కి పయనం సాగించడం!! ఒక్క మాటలో చెప్పాలంటే.. తిరోగమన బాటలో బృహస్పతి గ్రహం ఉంటుంది. ఈ తిరోగమనం వల్ల 3 రాశుల వారికి కొన్నేళ్ళుగా ఎదురవుతున్న కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. వారిపై ధన వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి.

వృషభం : బృహస్పతి తిరోగమనం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

మిథునం : తిరోగమన గురువు మిథునరాశి వారికి అనేక ప్రయోజనాలను ఇస్తాడు. ఉద్యోగంలో మార్పు, పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం విస్తరించబడుతుంది. ఈ సమయంలో మార్కెటింగ్ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి బృహస్పతి యొక్క రివర్స్ కదలిక అదృష్టమని చెప్పాలి. వీరికి అదృష్టం తోడై ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన ధనం మీకు అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.