Mahakumbh Stampede: మౌని అమావాస్య క‌లిసి రావ‌టంలేదా? కుంభమేళాలో గ‌తంలో కూడా తొక్కిస‌లాట‌ ఘ‌ట‌న‌లు!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభానికి దేశ, విదేశాల నుంచి భ‌క్తులు తరలివస్తున్నారు. ఈరోజు రెండవ అమృత స్నాన్ మహాకుంభంలో జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
Mahakumbh Stampede

Mahakumbh Stampede

Mahakumbh Stampede: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ నిర్వహిస్తున్నారు. కాగా మౌని అమావాస్య రాజస్నానానికి ముందు తొక్కిసలాట (Mahakumbh Stampede) జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో పలువురు భక్తులు గాయపడి మృతి చెందినట్లు సమాచారం. అయితే క్షతగాత్రులు, మృతుల గణాంకాలను అధికారులు వెల్లడించలేదు. అయితే తొక్కిసలాట వంటి సంఘటనల కారణంగా కుంభ్ ప్రాంతం గ‌తంలో కూడా రెండు, మూడు సార్లు వార్త‌ల్లో నిలిచిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

ప్రయాగ్‌రాజ్ కుంభ్ 1954: కుంభ్‌లో మొదటి తొక్కిసలాట 1954లో జరిగింది. 1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 800 మంది మరణించారు.

ఉజ్జయిని కుంభ్ 1992: 1992లో ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 50 మందికి పైగా భక్తులు మరణించారు.

నాసిక్ కుంభ్ 2003: మహారాష్ట్రలోని నాసిక్‌లో 2003 కుంభమేళా సందర్భంగా ఆగస్ట్ 27న తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 39 మంది చనిపోయారు.

Also Read: Peddireddy Agricultural Field : మంగళంపేట అడవిలో పెద్దిరెడ్డి వ్యవసాయక్షేత్రం.. సర్వత్రా చర్చ!

హరిద్వార్ కుంభ్ 2010: 2010లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా ఏప్రిల్ 14న తొక్కిసలాట జరిగింది. ఇందులో 7 మంది చనిపోయారు.

ప్రయాగ్‌రాజ్ కుంభ్ 2013: 2013లో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జ‌రిగింది. మౌని అమావాస్య నాడు అమృత స్నాన సమయంలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 10న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది చనిపోయారు.

ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభానికి దేశ, విదేశాల నుంచి భ‌క్తులు తరలివస్తున్నారు. ఈరోజు రెండవ అమృత స్నాన్ మహాకుంభంలో జరగనుంది. మౌని అమావాస్య రోజున పెద్ద సంఖ్యలో జనం రావడంతో తెల్ల‌వారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 17 మంది భక్తులు మరణించారని, అనేక మంది భక్తులు గాయపడినట్లు నివేదికలు వ‌స్తున్నాయి. ప్రమాదం తర్వాత గందరగోళం నెలకొంది. ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ క్షతగాత్రులను సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు అఖారా పరిషత్ అధ్యక్షుడు అమృత్ స్నాన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

  Last Updated: 29 Jan 2025, 09:28 AM IST